ప్రజలను మభ్యపెట్టడానికే వైకాపా బస్సు యాత్ర: జీవీఎల్‌

 సామాజిక న్యాయం పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికే వైకాపా మంత్రులు బస్సు యాత్ర నిర్వహిస్తున్నారని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు.

Published : 28 May 2022 04:53 IST

విశాఖపట్నం(పెదవాల్తేరు), న్యూస్‌టుడే:  సామాజిక న్యాయం పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికే వైకాపా మంత్రులు బస్సు యాత్ర నిర్వహిస్తున్నారని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. విశాఖలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళంలో బస్సు యాత్ర సందర్భంగా స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేయరాదని హితవు పలికారు.  ఒక్క భాజపా మాత్రమే ప్రతిభ, సమర్థత ఉన్న వారికి పదవుల ఇచ్చి సామాజిక న్యాయం చేయగలదన్నారు. ఎవరిని సంప్రదించి కోనసీమ జిల్లా పేరు మార్చారని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని