YS Viveka: వివేకా హత్యపై సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసాన్ని మంగళవారం పరిశీలించారు

Updated : 15 Sep 2021 10:55 IST

పులివెందుల, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసాన్ని మంగళవారం పరిశీలించారు. వివేకా హత్యపై సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ (సంఘటన పునర్నిర్మాణం) చేశారు. పడక గదిలో నిద్రిస్తున్న వివేకాను చంపేందుకు నిందితులు ఏ మార్గం నుంచి వచ్చారు? ఏ వాహనాన్ని వినియోగించారు? ఇంటి లోపలికి ఎలా, ఎంతమంది వచ్చారు? తదితర అంశాలపై  నిర్వహించారు. నిందితులు వ్యవహరించిన తీరును ఊహిస్తూ సీబీఐ బృందం కొద్దిసేపు అనుసరించింది. కొందరు నిందితుల పేర్లను రాయించుకున్న స్టిక్కర్లను చొక్కాలపై అతికించుకుని వారి మాదిరి వ్యవహరించింది. అనంతరం సీబీఐ అధికారులు పట్టణ పరిసరాలను పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని