కొత్త పీఆర్సీ కన్నా పాత జీతాలే మిన్న
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త వేతన సవరణతో తమకు ఒరిగేది ఏమీ లేదంటున్నారు. కొత్త వేతనాలు వస్తాయని ఎదురుచూస్తుంటే ప్రభుత్వం తమను నిరాశకు గురిచేసిందని
ఉద్యోగుల ఆవేదన
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త వేతన సవరణతో తమకు ఒరిగేది ఏమీ లేదంటున్నారు. కొత్త వేతనాలు వస్తాయని ఎదురుచూస్తుంటే ప్రభుత్వం తమను నిరాశకు గురిచేసిందని ఆందోళన చెందుతున్నారు. డీఏలు ఒకేసారి ఇవ్వడం వల్ల జీతాల్లో పెరుగుదల తప్ప కొత్త వేతన సవరణతో అదనంగా అందే జీతం ఏమీలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ కోసం వేయి కళ్లతో వేచిచూసిన తమకు ఇంత నిరాశాజనక పరిస్థితులు ఎదురవుతాయని ఊహించలేదని ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త పీఆర్సీ అమలు చేయడం కన్నా పాత పీఆర్సీ కొనసాగిస్తూ ఇదే మధ్యంతర భృతితో, డీఏలన్నీ అమలుచేస్తే ఇంతకన్నా ఎక్కువ జీతాలు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. అమల్లో ఉన్న పాత పీఆర్సీ, 27% మధ్యంతర భృతి, ఎప్పటినుంచో పెండింగులో ఉన్న కరవుభత్యం, పాత ఇంటి అద్దెభత్యం కలిపి లెక్కిస్తే కొత్త జీతం కన్నా పాత జీతమే ఎక్కువని చెబుతున్నారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగి మాట్లాడుతూ తమకు ఇంటి అద్దెభత్యం, ఐఆర్, సీసీఏ రూపంలో దాదాపు 21% కోత పెట్టి, డీఏల రూపంలో 20.02 ఇచ్చారని, అంతకన్నా సాధించింది ఏముందని వ్యాఖ్యానించారు.
కొందరు ఉద్యోగసంఘాల వారి విశ్లేషణ ఇలా..
* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మూలవేతనం 30,580. పాత పీఆర్సీ ప్రకారం, ఐఆర్, మొత్తం డీఏలు, 20% హెచ్ఆర్ఏ కలిపి రూ.61,938 మొత్తం వేతనం వస్తుంది. ఈ ఉద్యోగికి డీఏ రూ.16,985, ఇంటి అద్దె భత్యం రూ.6,116, మధ్యంతర భృతి రూ.8,257 అందుతాయి. కొత్త పీఆర్సీ ప్రకారం ఆయనకు అందే మొత్తం జీతం రూ.60,284 మాత్రమే. అంటే రూ.1,654 నష్టపోతారు. ఈ ఉద్యోగికి కొత్త పీఆర్సీలో అన్ని లెక్కలూ వేశాక ఈయనకు వచ్చే మూలవేతనాన్ని తదుపరి దశలో ఉంచితే రూ.47,090గా ఉంటుంది. కరవుభత్యం రూ.9427, అద్దె భత్యం రూ.3,767 మాత్రమే అందుతాయి. ఇంతకుముందు అందుతున్న ఇంటి అద్దెభత్యం రూ.6,116గా ఉంటే తాజా పీఆర్సీలో రూ.3,767 మాత్రమే అందుతుంది. సీసీఏ లేనే లేదు.
* రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఒక సెక్షన్ ఆఫీసర్కు మూలవేతనం రూ.37,100. పాత పీఆర్సీ ప్రకారం ప్రస్తుతం అన్నీ డీఏలూ అమలుచేసి, మధ్యంతర భృతి 27% ఇస్తూ, అమల్లో ఉన్న 30% హెచ్ఆర్ఏ పరిగణనలోకి తీసుకుంటే రూ.10,017 మధ్యంతర భృతి, రూ.11,130 ఇంటి అద్దె భత్యం, రూ.20,607 డీఏ మొత్తంగా వస్తూ మొత్తం రూ.78,854 అందుకుంటారు. అదే కొత్త పీఆర్సీలో కొత్త స్కేలు రూ.57,100గా ఉంటుంది. డీఏ రూపంలో రూ.11,431, ఇంటి అద్దె భత్యం రూ.9,136గా ఉంటుంది. మొత్తం జీతం రూ.77,667గా చేతికి అందుతుందని లెక్కిస్తున్నారు. అంటే నెలకు రూ.1,187 నష్టపోతారు.
* కర్నూలు జిల్లాలోని ఒక మున్సిపాలిటీలో గతంలో ఇంటి అద్దె భత్యం 14.5%. అక్కడ పనిచేసే ఒక ఉద్యోగి మూలవేతనం రూ.20,050. పాత పీఆర్సీ ప్రకారం ఐఆర్, హెచ్ఆర్ఏ, ఇవ్వాల్సిన మొత్తం డీఏలు అమలుచేస్తే ఆ ఉద్యోగికి ఇప్పుడు రూ.39,508 వేతనం వచ్చేది. కొత్త పీఆర్సీ అమలు వల్ల ఆయనకు రూ.39,468 వేతనంగా దక్కుతుంది. అంటే ఈ ఉద్యోగి విషయంలోను నెలకు రూ.40 వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* ఇంతకుముందు 10% హెచ్ఆర్ఏ ఉండి, ప్రస్తుతం 8%కు పరిమితమైన వారికి వారి స్కేళ్లను బట్టి కొద్దిగా ప్రయోజనం కనిపిస్తోంది.
* పై లెక్కల్లో సీసీఏ వల్ల నష్టపోతున్న మొత్తాలను కలపలేదు. సీసీఏ అన్ని చోట్లా, అందరు ఉద్యోగులకూ వర్తించదు. సీసీఏ అమల్లో ఉన్నచోట ఆ రూపంలో మరికొందరు ఇంకొంత నష్టపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్