రూ.1400 కోట్లతో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్
దేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను హైదరాబాద్లోని రాయదుర్గంలో రూ.1400 కోట్లతో నిర్మించామని, దీనిని త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ట్రాన్స్కో నిర్మించిన ఈ సబ్స్టేషన్కు మంత్రి బుధవారం వెళ్లి పరిశీలించారు.
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు: మంత్రి జగదీశ్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను హైదరాబాద్లోని రాయదుర్గంలో రూ.1400 కోట్లతో నిర్మించామని, దీనిని త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ట్రాన్స్కో నిర్మించిన ఈ సబ్స్టేషన్కు మంత్రి బుధవారం వెళ్లి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. ‘హైదరాబాద్కు 40 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరానికి విద్యుత్ వలయం ఏర్పాటు చేశాం. దీనితో ఒక్క క్షణం కూడా కరెంట్ పోదు. రాయదుర్గంలో నాలుగు సబ్స్టేషన్లు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి సాధారణంగా 100 ఎకరాల స్థలం అవసరం.. కానీ 5 ఎకరాల స్థలంలో అధునాతన పరిజ్ఞానంతో వాటిని నిర్మించాం. ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్కు 3 కిలోమీటర్ల కేబుల్స్ భూగర్భంలో ఏర్పాటు చేశాం. దేశంలో మొదటి సారి మోనోపోల్స్ కూడా వాడుతున్నాం. ఈ సబ్స్టేషన్తో హైదరాబాద్కు మరో రెండు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయవచ్చు’అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!