బిగ్‌బాస్‌ విజేతగా బిందు మాధవి

తెలుగమ్మాయి, నటి బిందు మాధవి ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ సీజన్‌-1 విజేతగా నిలిచారు. సీజన్‌ చివరి రోజు శనివారం వ్యాఖ్యాత, నటుడు నాగార్జున విజేతను ప్రకటించారు.

Updated : 22 May 2022 05:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగమ్మాయి, నటి బిందు మాధవి ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ సీజన్‌-1 విజేతగా నిలిచారు. సీజన్‌ చివరి రోజు శనివారం వ్యాఖ్యాత, నటుడు నాగార్జున విజేతను ప్రకటించారు. బిందు మాధవి స్వస్థలం ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె. ఆవకాయ్‌ బిర్యానీ, బంపర్‌ ఆఫర్‌, రామరామ కృష్ణకృష్ణ తదితర సినిమాల్లో నటించారు. ట్రోఫీతోపాటు రూ.40లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నారు. తెలుగు బిగ్‌బాస్‌ షోలో మహిళా కంటెస్టెంట్‌ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. గతంలో రన్నరప్‌గా నిలిచిన వ్యాఖ్యాత, నటుడు అఖిల్‌ ఈసారీ రన్నరప్‌గా నిలిచారు. 18 మంది పోటీదారులు పాల్గొన్న ఈ రియాలిటీ షో 84 రోజులపాటు సాగింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని