పీజీ వైద్య విద్యలో మళ్లీ ‘గ్రామీణ సేవ’!
పీజీ వైద్య విద్యార్థులకు గ్రామీణ/ప్రభుత్వ సేవను పునరుద్ధరించబోతున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో చేరే విద్యార్థులకు ఇది తప్పనిసరి కాబోతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం..
2022-23 నుంచి ప్రవేశాలు పొందే విద్యార్థులకు తప్పనిసరి
మార్గదర్శకాలు సిద్ధం?
ఈనాడు, అమరావతి: పీజీ వైద్య విద్యార్థులకు గ్రామీణ/ప్రభుత్వ సేవను పునరుద్ధరించబోతున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో చేరే విద్యార్థులకు ఇది తప్పనిసరి కాబోతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనరు కోటా కింద చేరే విద్యార్థులు ఏడాదిపాటు కౌన్సెలింగ్ ద్వారా కేటాయించిన ఆసుపత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే 707 మంది, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా (‘ఎ’ కేటగిరీ) కింద చేరే 1,142 మంది విద్యార్థులు ఈ గ్రామీణ సేవ పరిధిలోకి రానున్నట్లు సమాచారం. ప్రైవేటు వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాలో చేరే విద్యార్థులకు భారీగా ఫీజులుంటాయి. అందువల్ల వీరిని తప్పనిసరి గ్రామీణ సేవ నుంచి మినహాయించారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందేవారి పీజీ వైద్య విద్య 2025-26లో పూర్తి కానుంది. ఆ తరువాత వారు గ్రామీణ సేవ కింద ఏడాదిపాటు వైద్య విధాన పరిషత్కు చెందిన ప్రాంతీయ, సామాజిక, జిల్లా ఆసుపత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. అక్కడ అవసరాలకు తగ్గట్లుగా వైద్యులు ఉన్న పక్షంలో బోధనాసుపత్రుల్లో పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
గౌరవ వేతనాలిలా!
సూపర్ స్పెషాలిటీ వైద్యులకు నెలకు రూ.లక్ష, స్పెషాలిటీకి (పీజీ క్లినికల్) రూ.75,000, స్పెషాలిటీ (పీజీ పారా క్లినికల్) వైద్యులకు రూ.75వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చే అవకాశం ఉంది.
రూ.40 లక్షల జరిమానా!
వైౖద్య విద్యార్థులు తప్పనిసరిగా ‘గ్రామీణ సేవ’ ఏడాదిపాటు చేసేలా వ్యక్తిగత ‘బాండ్’ తీసుకుంటారు. మధ్యలో చేయనంటే పీజీ వైద్య విద్యార్థులకు రూ.40 లక్షలు, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు రూ.50లక్షల వరకు జరిమానా విధిస్తారు.
జాతీయ కోటాలో చేరే విద్యార్థులకు వర్తిస్తుందా!
పీజీ వైద్య విద్యలో జాతీయ కోటాలో నిర్దేశించిన సీట్లకు ఐచ్ఛికాలు ఇచ్చిన వారికి సీట్ల కేటాయింపు త్వరలో జరగనుంది. వీరంతా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే సీట్లు పొందుతారు. ఈ కోటాలో రాష్ట్ర విద్యార్థులతోపాటు ఇతర రాష్ట్రాల వారూ ఉంటారు. ఇప్పటివరకు అధికారికంగా చెప్పనందున వీరికి గ్రామీణ సేవ విధానాన్ని తప్పనిసరి చేయడం సాధ్యమవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!