బీమా అందక బిక్కుబిక్కు
రాష్ట్రంలో వైఎస్ఆర్ బీమా అమలు తీరు మాటలు కోటలు దాటినా, కాళ్లు గడప దాటని చందంగా ఉంది. బీమా క్లెయిమ్ల పరిష్కారానికి గరిష్ఠంగా 4-5 నెలల సమయం పడుతోంది.
9,092 సహజ మరణాలపై కుటుంబాలకు సాయం కరవు
ప్రమాద మృతుల క్లెయిమ్లలో 30.83 శాతమే పరిష్కారం
వైఎస్ఆర్ బీమాలో ప్రచార ఆర్భాటమే ఎక్కువ
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ బీమా అమలు తీరు మాటలు కోటలు దాటినా, కాళ్లు గడప దాటని చందంగా ఉంది. బీమా క్లెయిమ్ల పరిష్కారానికి గరిష్ఠంగా 4-5 నెలల సమయం పడుతోంది. క్లెయిమ్లను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వమే స్వయంగా ప్రకటించినా ఆచరణలో కనిపించడం లేదు. 2021-22లో 2,631 ప్రమాద మృతుల క్ల్లెయిమ్ల పరిష్కారంలో అతీగతీ లేదు. బాధిత కుటుంబాలు బీమా సాయం కోసం నిరీక్షిస్తున్నాయి. ఈ ఏడాది (2022-23) కూడా ప్రమాద మృతులకు సంబంధించిన మొత్తం క్ల్లెయిమ్ల్లో ఇప్పటివరకు 39.83 శాతమే పరిష్కారమయ్యాయి. 1.21 కోట్ల మందికి ఈ ఏడాది బీమా కల్పించినట్టు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. 18-50 ఏళ్లలోపు వారిలో సహజమరణానికి రూ.లక్ష చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 18-70 ఏళ్ల వారిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన, ప్రమాద కారణంగా పూర్తిగా అంగవికలురైన వారికి బీమా సంస్థ రూ.5 లక్షల పరిహారం ఇస్తుందని సర్కారు ప్రచారం చేస్తోంది. ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) కింద కేంద్రమిచ్చే 50% వాటా నిలిపేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరఫున పూర్తిగా ప్రీమియం చెల్లిస్తూ 2021 జులై నుంచి వైఎస్ఆర్ బీమా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వేదికపైనా ప్రచారం చేస్తోంది. క్ల్లెయిమ్ల పరిష్కారంలో మాత్రం ఏమాత్రం వేగం లేదు.
* ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు నమోదైన 9,092 సహజ మరణాలకు సంబంధించిన క్లెయిమ్లపై రూపాయి చెల్లించలేదు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఇందుకు సంబంధించి ఇప్పటికీ నిధులివ్వలేదు. ఈ ఏడాది జులైనుంచి ఇప్పటివరకు నమోదైన ప్రమాద మృతులకు సంబంధించిన 620 క్ల్లెయిమ్ల్లోనూ ఇప్పటికి 247 పరిష్కారమయ్యాయి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా సంస్థ జమ చేయాల్సి ఉంది.
* గతేడాది జులై నుంచి ఈ ఏడాది జూన్ మధ్య నమోదైన ప్రమాద మృతులకు సంబంధించిన 2,631 క్ల్లెయిమ్లు ఇప్పటికీ పరిష్కరించలేదు. అన్ని దశల్లోనూ పరిశీలించాక ఆమోదించిన క్లెయిమ్లు దాదాపు ఏడాదిగా నిలిచాయి. బీమా సంస్థ నిర్లక్ష్యం కారణంగా చెల్లింపుల్లో జాప్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిపై ఫిర్యాదులు స్వీకరించే అంబుడ్స్మన్ని ఆశ్రయించామని అంటున్నారు. క్లెయిమ్ల పరిష్కారానికి సంబంధించి కోరిన సమాచారం ప్రభుత్వశాఖల నుంచి సకాలంలో రానందున చెల్లింపులు చేయలేకపోయామని అంబుడ్స్మన్కు బీమా సంస్థ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోగా బీమా చెల్లింపు. బీమా మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ. గతంలో ఉన్నట్టు ప్రతి పాలసీకి పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై కింద కేంద్రమిచ్చే 50% వాటా ఇప్పుడు లేనప్పటికీ మానవతా దృక్పథంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచిత బీమా అమలు చేస్తోంది.
- ‘వైఎస్ఆర్ బీమా’పై రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబరు 21న చేసిన ప్రకటన సారాంశమిది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!