CM Jagan: సారొస్తున్నారు... మార్కెట్ మూసేయండి!
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నాలుగో విడత జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
నేడు మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన
వాహనాల పార్కింగ్కు టమాటా మార్కెట్ యార్డు కేటాయింపు
పల్లె సర్వీసుల రద్దుతో బస్సుల్లేక ప్రయాణికుల ఇబ్బందులు
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, మదనపల్లె నేరవార్తలు, రాయచోటి: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నాలుగో విడత జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనతో పోలీసులు, అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టమాటా మార్కెట్ యార్డును స్వాధీనం చేసుకుని బస్సుల పార్కింగ్కు కేటాయించి ఆ మేరకు బోర్డును ఏర్పాటు చేశారు. యార్డుకు సెలవు ప్రకటించి టమాటాలు తీసుకురావద్దని రైతులను కోరారు. అన్నమయ్యతో పాటు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విద్యా దీవెన కింద లబ్ధిదారులైన విద్యార్థులతో పాటు తల్లులను వెంట తీసుకురావాలని సచివాలయ సంక్షేమ సహాయకులను ఆదేశించారు. వీరికి ప్రత్యేకంగా బస్సులు కేటాయించారు. ప్రైవేటు పాఠశాలల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను సీఎం సభకు జనాన్ని తరలించేందుకు వినియోగిస్తున్నారు. మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల నుంచి టిప్పు సుల్తాన్ మైదానం వరకు దారి మధ్యలో ఉన్న దుకాణాలను బుధవారం వేకువజాము నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయాలని పోలీసులు హెచ్చరించారు. హెలీప్యాడ్ నుంచి సభావేదిక వరకు ఇనుప బారికేడ్లు, రోడ్డుకిరువైపులా కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే పల్లె వెలుగు సర్వీసులు రద్దు చేశారు. మంగళవారం రాత్రి రాయచోటి డిపో నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేస్తున్న సర్వీసులను అధికారులు రాత్రి 8.30 గంటలకే పరిమితం చేశారు. అనంతరం వెళ్లాల్సిన సర్వీసులు చాలా మార్గాల్లో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విచారణ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. చంటిబిడ్డలతో తల్లులు, వృద్ధులు, విద్యార్థులు బస్సుల కోసం నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో అధిక ఛార్జీలు భరించి ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది.
సీఎం జగన్ పర్యటన సందర్భంగా మదనపల్లె వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. పలువురు నేతలు పోటీలు పడి బీటీ కళాశాల నుంచి సభ జరిగే టిప్పు సుల్తాన్ మైదానం వరకు భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్కు పోటీపడుతున్న మల్లెల పవన్కుమార్రెడ్డి భారీగా కటౌట్లు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే నవాజ్ బాషా వర్గీయులు దానిని చింపివేశారు. ఎంపీ మిథున్రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న 23వ వార్డు కౌన్సిలర్ గిరిజా సాయికుమార్ బ్యానర్లనూ తొలగించారు. తీవ్ర ఆగ్రహానికి గురైన పవన్కుమార్రెడ్డి, గిరిజా సాయిప్రసాద్ వర్గీయులు ఎమ్మెల్యే కటౌట్లను కొన్ని చోట్ల చించేశారు. పలుచోట్ల ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు పరస్పరం వివాదాలకు దిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్