మహిళలు ఎవరికీ తక్కువ కాదు
‘మహిళలు ఎవరికీ తక్కువ కాదు. మాలోనూ దమ్ముంది. ఇక్కడ పలువురితో మాట్లాడా. స్వయం సహాయక సంఘాల మహిళల విజయ గాథలో రాధ గురించి తెలుసుకున్నా.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టీకరణ
ఈనాడు, తిరుపతి: ‘మహిళలు ఎవరికీ తక్కువ కాదు. మాలోనూ దమ్ముంది. ఇక్కడ పలువురితో మాట్లాడా. స్వయం సహాయక సంఘాల మహిళల విజయ గాథలో రాధ గురించి తెలుసుకున్నా. ఆమె పోరాటం చాలా గొప్పది. పనిలో చిన్నాపెద్దా తేడా ఏదీ ఉండదు. పేరులోనే తేడా ఉంటుంది’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. ఆమె సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో మాట్లాడారు. ‘భారత రాష్ట్రపతిగా నేను పర్యటించిన తొలి విశ్వవిద్యాలయం ఇదే’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయ సంఘాల సభ్యులు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలు, విద్యార్థినులు, ప్రొఫెసర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పద్మావతి వర్సిటీ వీసీ జమున, ఎస్వీయూ వీసీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం రాత్రి తన కుమార్తె ఇతిశ్రీ ముర్ముతో కలిసి తిరుమలకు వచ్చిన ఆమె శ్రీపద్మావతి అతిథి గృహంలో బస చేశారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు వాహన మండపం వద్దకు చేరుకున్నారు. మొదట పుష్కరిణి నీటితో ప్రోక్షణం చేసుకుని శ్రీభూవరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. మహద్వారం వద్ద రాష్ట్రపతికి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి అర్చక బృందం ఆమెకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. పెద్దజీయంగారు, చిన్నజీయంగారు, శ్రీవారి ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యం, సన్నిధిలోని ఇతర ఆలయాల చరిత్రను రాష్ట్రపతికి వివరించారు. దర్శనానంతరం ఆమెకు స్వామి వారి శేషవస్త్రాన్ని అందజేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న సప్త గో ప్రదక్షిణ మందిరానికి రాష్ట్రపతి చేరుకున్నారు. అక్కడ శ్రీవేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. అనంతరం గో తులాభారంలో గోవు బరువుకు సమానమైన 435 కిలోల దాణాను విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించి రూ.6 వేలు అధికారులకు అందజేశారు.
శ్రీపద్మావతి అమ్మవారి దర్శనం
విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్రపతి... తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిశోర్ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని దిల్లీకి వెళ్లారు. దర్శనం బాగా జరిగిందని, తిరుమల, తిరుచానూరు ఆలయాల్లో ఏర్పాట్లు బాగున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతోషం వ్యక్తంచేశారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రి ఆర్.కె.రోజా, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, సప్త గోప్రదక్షిణ మందిర దాత శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం