Tirumala: తిరుమల సమస్త సమాచారం కోసం యాప్‌

తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ యాప్‌ ద్వారా అందించేందుకు తితిదే అధికారులు చర్యలు చేపట్టారు.

Updated : 09 Dec 2022 06:59 IST

సిద్ధం చేస్తున్న ఐటీ విభాగం

ఈనాడు, తిరుపతి: తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ యాప్‌ ద్వారా అందించేందుకు తితిదే అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలను బుక్‌ చేయడం మొదలు.. సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంచేలా ఈ యాప్‌ను రూపొందించే పనిలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) విభాగం అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే యాప్‌ రూపకల్పన దాదాపు పూర్తయింది. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తేనున్నారు.

వాస్తవానికి గతంలో గోవింద యాప్‌ను తీసుకొచ్చినా అది పూర్తిస్థాయిలో భక్తులకు ఉపయోగపడలేదు. తాజాగా దాని స్థానంలో కొత్త యాప్‌ రానుంది. దర్శన టోకెన్లకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తితిదే వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకుంటున్నారు. కొత్తగా తీసుకొచ్చే యాప్‌ ద్వారా భక్తులు సులభంగా గదులు, శ్రీవారిసేవా టికెట్లను పొందేందుకు ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా ఇందులో చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని