కస్తూర్బాలలో అసౌకర్యాల రాజ్యం
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. అరకొర సదుపాయాలతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.
ఏడాదిగా మంజూరవని కాస్మెటిక్ ఛార్జీలు
ఒకే భవనంలో 280 మందికి బోధన, వసతి
ఇంటర్ పాఠ్యపుస్తకాలు లేకుండానే తరగతులు
ఈనాడు, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. అరకొర సదుపాయాలతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన కస్తూర్బాలు సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. నిధుల కొరత పేరుతో వీటిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఉన్నవారు, మధ్యలో బడిమానేసిన అమ్మాయిలు ఎక్కువ మంది చదివే వీటికి నిధులు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఇంతవరకు కాస్మెటిక్ ఛార్జీలను ఇవ్వలేదు. ట్రంకు పెట్టెలు, దుప్పట్లు పంపిణీ చేయలేదు. విద్యార్థినులు తీవ్ర చలితో వణుకుతున్నా దయచూపడం లేదు. కొన్నిచోట్ల ఇంటర్కు అదనపు గదులు లేకపోవడంతో తరగతి గదుల్లోనే రాత్రిపూట నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 352 విద్యాలయాలు ఉండగా వీటిల్లో ఒక్కో దాంట్లో 6-10 తరగతులకు 200 మంది చొప్పున చదువుతున్నారు. గతంలో 221 వాటిల్లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టగా.. ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన 131 చోట్ల ప్రారంభించారు. రెండేళ్లకు కలిపి ఒక్కో దాంట్లో 80 సీట్లు ఉన్నాయి.
ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే...
విద్యార్థినులకు కాస్మెటిక్ ఛార్జీల కింద ఒక్కొక్కరికీ నెలకు రూ.100 ఇవ్వాల్సి ఉండగా... ఏడాదిగా విడుదల చేయడం లేదు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. డిసెంబరులో ఖాతాల వివరాలను సేకరించడం మొదలు పెడితే వారికి డబ్బులు వేసేది ఎప్పుడో తెలియడంలేదు. గతంలో డబ్బులకు బదులు సబ్బులు, బ్రష్, ఇతర వస్తువులతో కూడిన కిట్లను ఇచ్చేవారు. ఈ విద్యా సంవత్సరంలో కిట్లను ఇవ్వలేదు... డబ్బులూ అందించడం లేదు. దీంతో పిల్లలు సబ్బులు, నూనెలు, ఇతర వస్తువులను ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. అనాథలు, పేద పిల్లలకు ఈ వ్యయం భారంగా మారుతోంది. దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు. మిక్సీలు, ఇతరత్రా సామగ్రి మరమ్మతులు, కిటికీలకు జాలీల ఏర్పాటులాంటి వాటి కోసం చాలాచోట్ల ప్రిన్సిపాళ్లు సొంతంగా డబ్బులను ఖర్చు చేశారు. గతేడాది దాదాపు ఒక్కో ప్రిన్సిపల్ రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వ్యయం చేయగా.. ఇంతవరకు వాటి బిల్లులను చెల్లించలేదు. ఈ ఏడాది బిల్లులను ఇస్తున్న అధికారులు పాత బకాయిలపై మౌనం వహిస్తున్నారు.
ఇంటర్మీడియట్కు పుస్తకాలే లేవు
మండలానికో మహిళా జూనియర్ కళాశాల ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ విద్యా సంవత్సరంలో 131 కస్తూర్బాలలో ఇంటర్మీడియట్ను ప్రవేశ పెట్టారు. అయితే... విద్యార్థినులకు ఇంతవరకు పాఠ్యపుస్తకాలను అందించలేదు. గతేడాది విద్యార్థుల నుంచి పుస్తకాలు తీసుకొని కొత్తవారికి ఇవ్వగా... కొత్తగా ప్రారంభించిన చోట విద్యార్థులే కొనుక్కోవాల్సి వచ్చింది.
గదులకు తీవ్ర కొరత: రాష్ట్రవ్యాప్తంగా 352 కస్తూర్బాలలో ఇంటర్ ఉన్నా 35 చోట్ల మాత్రమే రేకుల షెడ్లు నిర్మించారు. మిగతాచోట్ల అదనపు గదుల నిర్మాణంలో జాప్యం చేస్తున్నారు. 6-10 తరగతుల్లో 200 మంది అమ్మాయిలు ఉండేలా నిర్మించిన భవనాల్లో అదనంగా 80 మంది ఇంటర్ చదివేవారికి వసతి కల్పించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి కేజీబీవీలో సరిపడా గదులు లేకపోవడంతో డార్మిటరీల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పగలంతా చదువుకున్న తర్వాత విద్యార్థినులు రాత్రిపూట బెంచీలను పక్కకు జరిపి నిద్రపోతున్నారు. తరగతి గదుల నిర్మాణం చేపట్టినా ఇంకా పూర్తి కాలేదు. కర్నూలు జిల్లా ఆదోనిలోని కేజీబీవీలోనూ తరగతి గదులు సరిపడా లేకపోవడంలో సైన్సు, కంప్యూటర్ సైన్సు ల్యాబ్ల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. చాలావాటిల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!