ఏపీలో విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు రూ.2,618 కోట్ల రుణాలు
ఆంధ్రప్రదేశ్లో వివిధ విదేశీ ఆర్థిక సంస్థలతో చేపట్టే ప్రాజెక్టులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,618 కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో వివిధ విదేశీ ఆర్థిక సంస్థలతో చేపట్టే ప్రాజెక్టులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,618 కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. మొత్తం 8 ప్రాజెక్టులకు 2022-23 బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం రూ.2,950.49 కోట్లు కేటాయించగా 2023-24 బడ్జెట్లో ఆ మొత్తాన్ని రూ.2618.25 కోట్లకు తగ్గించింది.
ఆక్వాపై మరింత చొరవ చూపాల్సి ఉంది
మోపిదేవి వెంకటరమణారావు, రాజ్యసభ సభ్యుడు, వైకాపా
కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఏ రంగానికి ఎంత సమకూరుస్తుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రత్యేకహోదా సాధన మా ప్రధాన ఎజెండా. దానిపై శక్తివంచన లేకుండా చివరి వరకు పోరాడతాం. బడ్జెట్లో ఆక్వాకు సంబంధించి కొన్ని రాయితీలు కల్పించడం ఊరట కలిగిస్తున్నా ధరల స్థిరీకరణ, విదేశాలకు ఎగుమతికి ఫ్రీ ట్రేడింగ్ విషయంలో కేంద్రం ఇంకా చొరవ చూపాల్సి ఉంది.
విశాఖపట్నం-విజయవాడ మూడో లైన్ ఇవ్వాలి
మార్గాని భరత్, రాజమహేంద్రవరం ఎంపీ
రైల్వేపరంగా విశాఖపట్నం-విజయవాడ మధ్య మూడో లైను ఇవ్వాల్సి ఉంది. కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైను ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్కు 70 కి.మీ. దూరం తగ్గుతుంది. రామాయపట్నం పోర్టుకు నిధులు కేటాయించాలి. రాష్ట్రంలో కొత్తగా 18 వైద్య కళాశాలలు నిర్మిస్తుంటే మూడు కళాశాలలకు మాత్రమే నిధులిస్తామన్నారు.
రాష్ట్రానికి నిరాశ
రామ్మోహన్ నాయుడు, తెదేపా లోక్సభా పక్ష నేత
కేంద్ర బడ్జెట్.. మధ్యతరగతి, సామాన్యులకు ప్రయోజనం కలిగించేలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే మాత్రం నిరాశాజనకంగా ఉంది. రాష్ట్ర విభజన హామీలను పదేళ్లలో పూర్తి చేయాలి. బడ్జెట్లో మాత్రం వాటి ప్రస్తావనే రాలేదు. ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి ప్రయోజనాలూ లేకపోవడానికి వైకాపా బాధ్యత వహించాలి. మేం అధికారంలో ఉన్న తొలి అయిదేళ్లలో పోలవరం 70 శాతం పూర్తి చేశాం. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి రైల్వే జోన్ ప్రకటించేలా చేశాం. వెనుకబడిన జిల్లాలకు నిధులు సాధించాం. ఈ విషయంలో వైకాపా ఎంపీలు విఫలమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ సీబీఐ, ఈడీ ఇతర కేసుల మాఫీకి దిల్లీ పర్యటనలు చేస్తున్నారు.
నిధులు రాబట్టడంలో విఫలం
కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెదేపా జాతీయ అధికార ప్రతినిధి
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జాతీయ స్థాయిలో బడ్జెట్ ప్రతిపాదనలు ఆశాజనకంగా ఉన్నా...జగన్రెడ్డి వైఫల్యం కారణంగా రాష్ట్రానికి నిరాశే మిగిలింది. పక్క రాష్ట్రమైన కర్ణాటక వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.5,300 కోట్లు సాధించుకుంది. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్నా రూపాయి కేటాయింపు జరగలేదు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మౌలిక రంగాల ప్రాజెక్టులకూ మొండి చేయే చూపారు.
ఏపీకి మళ్లీ మొండిచేయి
కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి మరో మారు మొండిచేయి చూపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం, విభజన చట్ట హామీల అమలుకు చర్యలు లేకపోవడం విచారకరం. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి, పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాలకు నిధుల ఊసేలేదు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కర్ణాటకకు కేటాయింపులు
శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటి గురించి కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించలేదు. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు 2022-23 బడ్జెట్లో కంటే ఈ సారి 15% కోత వేయడం అమానుషం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కర్ణాటకకు కేంద్రం కేటాయింపులు పెంచింది.
ఏపీపై కేంద్రానికి చిన్నచూపు
భీశెట్టి బాబ్జీ, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు
కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లోనూ ఏపీని పట్టించుకోలేదు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల ప్రస్తావన లేదు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోన్, విశాఖ మెట్రోరైలు, కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్యకళాశాలలకు నిధులపై మాట్లాడలేదు.
రాజధాని నిర్మాణానికి నిధుల ప్రస్తావన లేదు
బాలకోటయ్య, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు
ఈ బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపింది. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ప్రస్తావన బడ్జెట్లో లేదు. రాజధాని నిర్మాణానికి నిధుల గురించి బడ్జెట్లో లేకపోవడం బాధాకరం. ఏపీకి ఏమి ఇచ్చిందో కేంద్రాన్ని సీఎం జగన్ అడగాలి.
ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేటు సంస్థలకు లబ్ధి
వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు కొనసాగింపుగానే ఈ బడ్జెట్ కూడా ఉంది. రైల్వేస్టేషన్లు, రైలు మార్గాలను ప్రైవేటీకరిస్తూ వాటిపైన రూ.2.4 లక్షల కోట్లు వ్యయం చేయటం ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేటు సంస్థలకు లబ్ధిచేకూర్చడమే అవుతుంది.
రైతు వ్యతిరేక బడ్జెట్
రాధాకృష్ణ, హరిబాబు, కౌలు రైతుల సంఘం నేతలు
కేంద్ర బడ్జెట్లో కౌలు రైతుల సంక్షేమం గురించి లేకపోవడం అన్యాయం. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పే కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధిని పెంచేలా ప్రకటన చేయకపోవడం దారుణం. కనీస కూలిని పెంచి గ్రామీణ పేదలకు పనులు కల్పించాలి.
విద్యా రంగానికి ఊతమివ్వదు
యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ
ఈ బడ్జెట్ విద్యారంగానికి ఊతమివ్వదు. కేంద్రం విద్యా రంగ బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. శాస్త్ర, సాంకేతిక రంగాలకు రెండు శాతం నిధులు కేటాయించాలి. కానీ..0.7% మాత్రమే కేటాయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!