నగరాల అభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు కీలకం
నగరాల అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నారు.
ఐడబ్ల్యూజీ వర్క్షాప్లో వక్తలు
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: నగరాల అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నారు. జీ20 సన్నాహక సదస్సుల్లో భాగంగా ఆర్థిక వ్యవహారాలు, గృహ, పట్టణ వ్యవహారాల శాఖలు, అôతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎఫ్సీ) సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో బుధవారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆరోఖ్యరాజ్ ప్రారంభించి మాట్లాడారు. ఐఎఫ్సీ భారత మేనేజర్ వెండీ జో వెర్నర్, ఐరోపా ప్రతినిధి బృందంలోని సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ డెల్ఫైన్ బ్రిస్సోన్యూ మాట్లాడుతూ అభివృద్ధిలో నగరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
పలు అంశాల ప్రదర్శన: స్వచ్ఛత యాప్తో సాంకేతికత వినియోగం, మహిళల భాగస్వామ్యం, రేటింగ్ సిస్టమ్లను స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్) డైరెక్టర్ బినయ్కుమార్ జా ప్రదర్శించారు. అమృత్ మిషన్ డైరెక్టర్ లావణË్య కుమార్ మాట్లాడుతూ పది లక్షల జనాభా దాటిన నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల గురించి వివరించారు. నగరాల్లో రవాణా క్లబ్, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ, పైకప్పులపై సౌరశక్తి పలకల అమరిక తదితర పది కేస్ స్టడీలను స్మార్ట్ సిటీ మిషన్ డైరెక్టర్ లాల్ చాందమ వివరించారు.
వాణిజ్య నిధులకు పరిమితులు
రిజర్వు బ్యాంకు సహాయ సలహాదారు సోమనాథ్ శర్మ, సెబీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దివ్య హమీర్బాసియా, ఐఎఫ్సీ ప్రధాన పెట్టుబడుల అధికారి నీరజ్ గుప్తాలు వాణిజ్య నిధుల పరిమితులను వివరించారు. సోమనాథ్ మాట్లాడుతూ 2019-2035 మధ్యలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 20 నగరాల్లో 17 మన దేశం నుంచి ఉంటాయని పేర్కొన్నారు. ఐఎఫ్సీ నిపుణులు జార్జి బట్లర్ కూడా మాట్లాడారు.
70 మంది ప్రతినిధుల హాజరు
హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఈఈ శ్రీనివాసరెడ్డి చెత్త నుంచి విద్యుత్తు తయారీని వివరించారు. వర్క్షాప్లో ఏపీతో పాటు తెలంగాణ సహ పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, పుదుచ్చేరి నుంచి 70 మందికి పైగా పుర కమిషనర్లు, మేయర్లు హాజరయ్యారు. రెండో రోజైన గురువారం జరగనున్న వర్క్షాప్లో నగరాల ఆర్థిక సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు, వాణిజ్య పెట్టుబడుల సమీకరణకు ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్, నిధుల సమీకరణకు ఉన్న మార్గాలను వివరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!