34 కేజీబీవీల్లో సున్నా ఫలితాలు
ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు అధికంగా వస్తున్నాయి. కస్తూర్బాగాంధీ బాలకల విద్యాలయాల(కేజీబీవీ) ఫలితాలు అధికంగా ఉంటున్నాయి.
బయటపడిన మంత్రి బొత్స ప్రకటనల్లోని డొల్లతనం
పాఠ్యపుస్తకాలు, వసతి లేకుండానే ఇంటర్మీడియట్ కోర్సు ప్రారంభించిన ప్రభుత్వం
విజయనగరంలో మూడు కేజీబీవీల్లో ఒక్కొక్కరే ఉత్తీర్ణత
* ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు అధికంగా వస్తున్నాయి. కస్తూర్బాగాంధీ బాలకల విద్యాలయాల(కేజీబీవీ) ఫలితాలు అధికంగా ఉంటున్నాయి.
ఇంటర్ ఫలితాల విడుదల సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
* మంత్రి చేసిన ప్రకటనకు క్షేత్రస్థాయిలో ఇంటర్ ఫలితాలకూ సంబంధమే లేదు. రాష్ట్రంలో 34 కేజీబీవీల్లో సున్నా ఫలితాలు వచ్చినా ప్రైవేటు కంటే ఎక్కువ వస్తున్నాయని బొత్స ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందనే ఫలితాలను యాజమాన్యాల వారీగా విడుదల చేయలేదు.
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు, కేజీబీవీల డొల్లతనం బయటపడింది. మండలానికో మహిళా జూనియర్ కళాశాల ఉండాలంటూ సీఎం జగన్ ఆదేశించడం.. ముందూ వెనుక ఆలోచించకుండా అధికారులు ప్రారంభించేయడం.. ఇప్పుడు పేద పిల్లలను ఇబ్బందులకు గురి చేసింది. సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై 292 హైస్కూల్ ప్లస్తోపాటు 131 కేజీబీవీల్లోనూ ఇంటర్మీడియట్ ప్రారంభించారు. ఇక్కడ విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వలేదు. విద్యార్థులే సొంతంగా పుస్తకాలు కొనుక్కోవాల్సి వచ్చింది. హైస్కూల్ ప్లస్లో పాఠాలు చెప్పేందుకు లెక్చరర్లను నియమించకుండానే అక్కడే ఉన్న ఉపాధ్యాయులకు బోధన బాధ్యతలు అదనంగా అప్పగించారు. దీంతో సుమారు 50%పైగా హైస్కూల్ ప్లస్లో సున్నా ఫలితాలు వచ్చాయి. 131 కేజీబీవీలకుగాను 30 కేజీబీవీల్లో ఒక్కరూ పాస్ కాలేదు. మరో మూడింటిలో రెండో ఏడాదిలో సున్నా ఫలితాలు వచ్చాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఏడు కేజీబీవీల్లో ఒక్కరూ పాస్ కాలేదు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో మూడు కేజీబీవీల్లో ఒక్కొక్కరు చొప్పున ఉత్తీర్ణత సాధించారు. ఈ మూడింటిలో 64మంది పరీక్షలకు హాజరు కాగా.. ముగ్గురు పాసయ్యారు. ఉమ్మడి విజయనగరం కేజీబీవీల నుంచి 717మంది పరీక్షలు రాస్తే 48%మంది పాస్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో 704మంది పరీక్షలు రాస్తే 54.26శాతం ఉత్తీర్ణులయ్యారు.
పాఠాలు చెప్పేవారు లేకుండా ఎలా?
హైస్కూల్ ప్లస్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థినులకు పాఠాలు చెప్పేవారు లేరని, పుస్తకాలు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. బాలికల కోసం ప్రత్యేక కళాశాల పెట్ట్జామని మాత్రమే చూశారు. పదో తరగతి వరకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులనే ఇంటర్మీడియట్కూ బోధించాలని ఆదేశించారు. జూన్లో తరగతలు ప్రారంభమైతే ఈ ఏడాది జనవరి వరకు పాఠ్య పుస్తకాలే ఇవ్వలేదు. కొన్నిచోట్ల పాత పుస్తకాలను సర్దుబాటు చేశారు. ఈ కళాశాలలను ప్రారంభించడంలోనే జాప్యం చేయడంతో మొత్తంగా 292 కళాశాలల్లో 3,444మంది ప్రవేశాలు పొందారు. వీరిలో దాదాపు సగం మంది ఫెయిల్ అయ్యారు.
* ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో బాలికల హవా కొనసాగగా.. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన బాలికల కళాశాలల్లో మాత్రం ఫలితాలు 50శాతం మించలేదు. కళాశాలను ఏర్పాటు చేసేప్పుడు భవనం ఉందా? బోధనకు అధ్యాపకులు ఉన్నారా? పాఠ్యపుస్తకాలు ఉన్నాయా? అనేదాన్ని పరిశీలించాలి. కానీ, హైస్కూల్ ప్లస్లో ఇంటర్ ఏర్పాటుకు ఇవేమి పట్టించుకున్న దాఖలాలు లేవు.
* కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను 6-10 తరగతుల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ అదనపు గదులు నిర్మించకుండానే ఇంటర్మీడియట్ను ప్రారంభించేశారు. దీంతో ఒకేగదిలో బోధన, రాత్రిపూట నిద్ర చేయాల్సిన దుస్థితి అమ్మాయిలకు ఏర్పడింది. కొత్తగా మరుగుదొడ్లు సైతం నిర్మించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!