Chandrababu: అమర్‌నాథ్‌ కుటుంబీకుల పరామర్శకు చంద్రబాబు

తన సోదరిని వేధించవద్దన్నందుకు వైకాపా కార్యకర్త చేతిలో సజీవదహనమైన ఉప్పాల అమర్‌నాథ్‌ కుటుంబీకులను పరామర్శించడానికి తెదేపా అధినేత చంద్రబాబు.. బాలుడి స్వగ్రామం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం రానున్నారు.

Updated : 19 Jun 2023 08:38 IST

ఈనాడు, బాపట్ల: తన సోదరిని వేధించవద్దన్నందుకు వైకాపా కార్యకర్త చేతిలో సజీవదహనమైన ఉప్పాల అమర్‌నాథ్‌ కుటుంబీకులను పరామర్శించడానికి తెదేపా అధినేత చంద్రబాబు.. బాలుడి స్వగ్రామం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం రానున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బాలుడి ఇంటికి చేరుకుని వారి కుటుంబీకులను పరామర్శిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16న చెరుకుపల్లి మండలం రాజోలు వద్ద పాము వెంకటేశ్వరరెడ్డి, అతని స్నేహితులు ముగ్గురు కలిసి ట్యూషన్‌కు వెళుతున్న అమర్‌నాథ్‌ను కొట్టి పెట్రోలు పోసి నిప్పంటించడంతో మృతిచెందిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని