తెలంగాణ ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఏపీది అపోహే
గోదావరిపై కొత్తగా చేపట్టే ప్రాజెక్టులతో దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పేర్కొనడం అపోహ మాత్రమేనని కేంద్ర జలసంఘం స్పష్టంచేసింది. ఉమ్మడి రాష్ట్రానికి గోదావరిలో ఉన్న నీటిని పునర్విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ఎవరికెంత కేటాయించాలనే విషయాన్ని ట్రైబ్యునల్ తేల్చలేదని పేర్కొనడాన్నీ తోసిపుచ్చింది.
ఆ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండదు
కేటాయింపులు జరిగే వరకు.. అనుమతులు ఆపలేం
గోదావరిలో ఆంధ్రప్రదేశ్ వినియోగం 531.908 టీఎంసీలు మాత్రమే
మోదికుంటవాగు, గూడెం ఎత్తిపోతల టీఏసీ నోట్లో జలసంఘం స్పష్టీకరణ
ఈనాడు, హైదరాబాద్: గోదావరిపై కొత్తగా చేపట్టే ప్రాజెక్టులతో దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పేర్కొనడం అపోహ మాత్రమేనని కేంద్ర జలసంఘం స్పష్టంచేసింది. ఉమ్మడి రాష్ట్రానికి గోదావరిలో ఉన్న నీటిని పునర్విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ఎవరికెంత కేటాయించాలనే విషయాన్ని ట్రైబ్యునల్ తేల్చలేదని పేర్కొనడాన్నీ తోసిపుచ్చింది. గోదావరిలో ఏపీ వినియోగం 531.908 టీఎంసీలు మాత్రమేనని స్పష్టంచేసింది. తెలంగాణ చేపట్టిన మోదికుంటవాగు, కడెం-గూడెం ఎత్తిపోతల పథకాలకు అనుమతిపై ఈ నెల 14న కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) సమావేశం నిర్వహించనుంది. వీటిపై తెలంగాణ సమర్పించిన డీపీఆర్లను ఆంధ్రప్రదేశ్తోపాటు ఇతర భాగస్వామ్య రాష్ట్రాలకు పంపిన జలసంఘం వాటి అభిప్రాయాలను కోరింది. గోదావరిలో రెండు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ జరగలేదని, ఎగువన ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువనున్న తమకు నష్టం వాటిల్లుతుందని, కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఇతర రాష్ట్రాలు ఎలాంటి అభ్యంతరం వ్యక్తంచేయలేదు. ఈ మేరకు జలసంఘం తయారు చేసిన సాంకేతిక నివేదికలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. అందులో ఏముందంటే... ‘‘ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ మా పరిశీలనలో లేదు. ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య నీటి పంపిణీకి సంబంధించి ఎలాంటి ఒప్పందాలు లేవు. మొత్తం బేసిన్కు అమలులో ఉన్న గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ఆధారంగా అంతర్రాష్ట్ర ప్రాజెక్టులను పరిశీలించడానికి మార్గదర్శకాలు ఉన్నాయి.
ట్రైబ్యునల్ అవార్డు లేకపోవడం, అంతర్రాష్ట్ర జల ఒప్పందం జరగకపోవడం, కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు కాకపోవడం వంటివి ఉంటే... అంతర్రాష్ట్ర రివర్ బేసిన్లో ఉన్న ప్రాజెక్టును జాగ్రత్తగా పరిశీలించి, ఎగువ, దిగువ ప్రాంతాల్లో భవిష్యత్తులో జరిగే పరిణామాలను పరిగణనలోకి తీసుకుని, కొత్త ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నీటి పంపిణీకి సంబంధించి ఎలాంటి ఒప్పందం జరగలేదని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది... అయితే ఈ ఒప్పందాలు జరిగే వరకు కేంద్ర జలసంఘం ఎదురుచూడదు. ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా డీపీఆర్లను పరిశీలిస్తుంది. కేంద్ర జలసంఘం వద్ద ఉన్న సమాచారం, 2021 జులై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, ఆమోదించిన ప్రాజెక్టులపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 జనవరి 2న రాసిన లేఖ, 2021 అక్టోబరు 9న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సమాచారం, ఇదే అంశంపై 2022 ఫిబ్రవరి ఒకటి, అదే ఏడాది మార్చి 24న రాసిన వివరణ లేఖలను పరిగణనలోకి తీసుకోగా... గోదావరిలో ఆంధ్రప్రదేశ్ వినియోగం 531.908 టీఎంసీలుగా లెక్క తేలింది. ఇంతకుమించి ఏపీ ప్రాజెక్టులకు సంబంధించిన జలసంఘం వద్ద ఎలాంటి డీపీఆర్లు లేవు. పైవినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని అంతర్రాష్ట్ర కోణంలో మోదికుంటవాగుకు నీటి లభ్యత ఆమోదం తెలిపాం. నీటి లభ్యత అన్నది ప్రతిపాదిత ప్రాజెక్టు వద్ద మాత్రమే చేయాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు నీటి లభ్యత ఎలా లెక్కగట్టామో, తెలంగాణలోని ప్రాజెక్టులకు ఆమోదం తెలపడానికి కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నాం. జలసంఘం నీటి లభ్యతపై చేసిన అధ్యయనాన్ని ఆంధ్రప్రదేశ్ అంగీకరించాల్సిందే’’ అని జలసంఘం స్పష్టంచేసింది.
రూ.638 కోట్లతో రెండు ప్రాజెక్టులు
- తెలంగాణ ప్రభుత్వం ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో 2.25 టీఎంసీల నీటి వినియోగంతో మోదికుంటవాగు ప్రాజెక్టును చేపట్టింది. 21,349 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా 2.07 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టే దీని నిర్మాణ వ్యయం రూ.500.26 కోట్లు.
- 1958లో నిర్మించిన కడెం రిజర్వాయరు నిల్వ సామర్థ్యం 7.60 టీఎంసీలు. పూడిక పెరగడంతో అది 4.699 టీఎంసీలకు పడిపోయింది. దీంతో చివర ఆయకట్టుకు నీరందడంలేదు. ఈ నేపథ్యంలోనే ఎల్లంపల్లి వెనుకభాగం (బ్యాక్వాటర్)లో కడెం-గూడెం ఎత్తిపోతల పథకాన్ని రూ.138 కోట్లతో 2015లో ప్రతిపాదించారు. దీని ద్వారా మళ్లించే నీటిని కడెం ఎడమ ప్రధాన కాలువ 58.4 కి.మీ వద్ద వేసి 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం దీని లక్ష్యం. ఈ రెండింటి అనుమతిపై సిఫార్సు చేసేందుకే 14న జలసంఘం టీఏసీ సమావేశం జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ