రెండో రోజూ అట్టుడికిన సభ
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై రెండో రోజు శుక్రవారమూ శాసనసభ అట్టుడికింది. తెదేపా నినాదాలు, వైకాపా సవాళ్లతో సభ దద్దరిల్లింది.
చంద్రబాబు అరెస్టుపై అసెంబ్లీలో ఉద్రిక్తత
తెదేపా నినాదాలు, వైకాపా సవాళ్లతో దద్దరిల్లిన వైనం
స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన తెదేపా సభ్యులు
విపక్ష ఎమ్మెల్యేలను దుర్భాషలాడిన మంత్రులు
అయిదుగురు తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఈనాడు, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై రెండో రోజు శుక్రవారమూ శాసనసభ అట్టుడికింది. తెదేపా నినాదాలు, వైకాపా సవాళ్లతో సభ దద్దరిల్లింది. ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి..’ అనే నినాదాలతో తెదేపా సభ్యులు సభను హోరెత్తించారు. అధికార పార్టీ తీరును నిరసిస్తూ విజిల్స్ వేస్తూ నిరసన తెలిపారు. సభ ప్రారంభంకాగానే తెదేపా సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక దశలో పలువురు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు.. తెదేపా సభ్యులపైకి దూసుకెళ్లారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెదేపా, వైకాపా సభ్యుల మధ్య మార్షల్స్ అడ్డుగోడలా నిలిచారు. తెదేపా సభ్యులపై మంత్రులు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిరసనలో పాల్గొన్నారు. గురువారం ముగ్గురిని సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. శుక్రవారం తెదేపా ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్లను సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణబాబులను శుక్రవారం ఒక్కరోజు సభ నుంచి బహిష్కరించారు. దీన్ని నిరసిస్తూ మిగతా తెదేపా సభ్యులు సభను బాయ్కాట్ చేశారు.
ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఉండేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: బుగ్గన
ఉదయం సభ ప్రారంభమైన 12 నిమిషాలకే స్పీకర్ వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయం మొదలుకాగానే తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని తెదేపా సభ్యులు పట్టుబట్టారు. ఓ ప్రశ్నకు మంత్రి గుడివాడ అమర్నాథ్ సమాధానమిస్తుండగా.. తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ వెల్లో నిల్చొని, మిగిలినవారు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. సంబోధన, ప్రవర్తనే ముఖ్యం. ఇక్కడి వైకాపా సభ్యులందరికీ నోరు ఉంది. తెదేపా సభ్యులు ఎలాపడితే అలా మాట్లాడితే చూస్తూ ఉండేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు’ అని హెచ్చరించారు. మంత్రి అంబటి మాట్లాడుతూ.. ‘డైలాగులు ఏమైనా ఉంటే తెదేపా కార్యాలయంలో మాట్లాడుకోవాలి. ఇక్కడ తప్పుగా మాట్లాడితే ఊరుకోబోం’ అని వ్యాఖ్యానించారు. పోడియం పైనుంచి తెదేపా సభ్యుల నినాదాలు, కింది నుంచి వైకాపా సభ్యుల హెచ్చరికలతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సభను వాయిదా వేశారు.
సభను తప్పుదారి పట్టిస్తున్నారు
- మంత్రి జోగి రమేశ్
సభ తిరిగి మొదలయ్యాక తెదేపా సభ్యులు పోడియంవైపు వెళ్లకుండా పదుల సంఖ్యలో మార్షల్స్ మోహరించారు. మార్షల్స్ సాయంతో అడ్డుకోవడాన్ని తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్, బుచ్చయ్యచౌదరి వీడియో తీశారు. తెదేపా సభ్యులు అక్కడే నిల్చొని ఉధృతంగా నినాదాలు చేశారు. వీడియో తీసినందుకు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్లను సస్పెండ్ చేయాలని చీఫ్ విప్ ప్రసాదరాజు తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో ఆ మేరకు స్పీకర్ ప్రకటించారు.
తెదేపా నిరసనల మధ్యనే బిల్లుల ఆమోదం
టీ విరామం తర్వాత స్పీకర్ సీతారాం సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆరుగురు మాజీ ఎమ్మెల్యేల మృతికి సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం తెదేపా సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. వారి నిరసనల మధ్యే స్పీకర్ పలు బిల్లులను ప్రవేశపెట్టారు. ఏపీ ప్రత్యేక భద్రతా దళం-2023 బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్-2023 బిల్లు, ఏపీ ఆధార్-2023 బిల్లులను సభ ఆమోదించింది. తెదేపా నిరసనలు కొనసాగుతుండగానే ఆ పార్టీ సభ్యులు నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి, వెలగపూడి రామకృష్ణబాబులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారిని శుక్రవారం ఒక రోజు స్పీకర్ సస్పెండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kurnool: పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు
వైకాపా తన ప్రచారానికి దేనిని వదలడం లేదు. చివరికి ప్రభుత్వ నిధులతో నిర్వహించనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలకు సంబంధించిన పరికరాలను సైతం పార్టీ ప్రచారానికి వాడుకుంటోంది. -
Rameswaram Express: రామేశ్వరం ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో చిత్తూరు-పాకాల రైలు మార్గంలో విరిగిన రైలు పట్టాను ట్రాక్మెన్ సుజిత్ సకాలంలో గుర్తించడంతో రామేశ్వరం ఎక్స్ప్రెస్కు సోమవారం పెను ప్రమాదం తప్పింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రామాణిక విద్యకు ఛార్జి మెమోలే పరిష్కారమా?
ఏకపక్ష నిర్ణయాలతో ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసి, ఛార్జిమెమో ఇవ్వడం ద్వారా విద్యారంగంలోని సమస్యలు పరిష్కారం అవుతాయా అని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. -
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దంపతులు దిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
ఏపీలో ఎయిర్ఫైబర్ సేవలు విస్తరించిన జియో
రిలయన్స్ జియో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఎయిర్ఫైబర్ సేవలను రాష్ట్రంలో విస్తరించినట్లు జియో ఏపీ సీఈవో ఎం.మహేశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
Ramana Deekshitulu: తిరుమలలో ఆచారాలను నాశనం చేస్తున్న ప్రభుత్వం: రమణ దీక్షితులు
తితిదే అధికారులపై తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఎక్స్ (ట్విటర్)లో పలు ఆరోపణలు చేశారు. వాటిని ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. -
ఐఐటీఎఫ్లో ఏపీ పెవిలియన్కు మూడో బహుమతి
దేశ రాజధాని దిల్లీ ప్రగతిమైదాన్లో ఈనెల 14 నుంచి 27 వరకు నిర్వహించిన భారత అంతర్జాతీయ వ్యాపారమేళా (ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ఫెయిర్- ఐఐటీఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేసిన పెవిలియన్కు మూడో బహుమతి దక్కింది. -
కరెంటోళ్ల నెత్తిన అప్పుల కుప్ప!
విద్యుత్ పంపిణీ సంస్థలకూ (డిస్కంలు) జగన్ ‘షాక్’ తప్పలేదు. ఈ ఏడాది జులై నాటికి వాటి నెత్తిన ప్రభుత్వం రూ.19 వేల కోట్ల కొత్త అప్పులు పెట్టింది. ఇప్పటికే డిస్కంలు నెలవారీ నిర్వహణ ఖర్చులకూ సతమతమవుతున్నాయి. -
అన్నవరం సత్యదేవుని గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి గిరిప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో అంచనాలకు మించి తరలివచ్చారు. సుమారు రెండు లక్షలకు పైగా ప్రదక్షిణలో పాల్గొన్నారని అధికారుల అంచనా. -
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ మూడో వివాహం
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. -
స్మార్ట్మీటర్ల ఏర్పాటు.. మోదీ మెప్పుకోసమే
‘స్మార్ట్మీటర్ల ఏర్పాటును భాజపా పాలిత రాష్ట్రాలు సహా అందరూ వ్యతిరేకిస్తున్నారు. మోదీ మెప్పు కోసం ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ ఏడాది 10 లక్షల వ్యవసాయ పంపుసెట్లు సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్మార్ట్మీటర్లను బిగించడానికి సన్నాహాలు చేస్తోంది’ -
రాజధానిలో యథేచ్ఛగా రహదారుల విధ్వంసం
రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం బోరుపాలెం ఇసుక రీచ్ వద్ద రోడ్డు తవ్వుకుపోయిన దొంగలు.. -
పుడమితల్లికి సేవ.. లాభాల సాగుకు తోవ
ఏ పంటైనా సరే.. విత్తు దగ్గర నుంచి కోత వరకు కనీసం 60- 180 రోజుల సమయం పడుతుంది. అదే ప్రతివారం ఏదో ఒక పంట కోతకు వచ్చి ఆదాయం చేతికందితే ఎలా ఉంటుంది. అదే చేసి చూపించారు.. అనంతపురం జిల్లాకు చెందిన రైతు నారాయణప్ప. -
పశువులూ అల్లాడుతున్నాయ్!
నోరులేని మూగజీవులు మనల్నేమైనా అడగొచ్చాయా? అనే ధైర్యం... మనుషులకే వైద్యాన్ని అందించలేకపోతున్నాం... ఇక పశువుల్ని ఏం పట్టించుకుంటాం? అనే దైన్యం... ఇదీ వైకాపా పాలనలో దుస్థితి. -
వచ్చామా.. చూశామా.. వెళ్లామా..!
ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన హడావుడిగా సాగింది. కొన్ని చోట్ల ఆయన పదేసి నిమిషాలపాటు మాత్రమే పరిశీలించారు. -
Kachidi Fish: ఒక్క చేప.. రూ.3.9 లక్షలు!
గోల్డెన్ ఫిష్గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. -
పెద్దిరెడ్డి ఇలాకాలో భూసేకరణపై రైతుల మండిపాటు
విద్యుత్తు బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్కు తమ భూములు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రైతులు ధర్నాకు దిగారు. -
వెలిగొండ గుండె మండుతోంది!
వచ్చే ఏడాది సెప్టెంబరు, అక్టోబరుకల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, జలాశయంలో నీటిని నిలుపుతాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రాజెక్టు నిర్వాసితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం. ప్యాకేజీ అందిస్తాం. -
డి-ఫార్మసీ(పాలిటెక్నిక్) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
పాలిటెక్నిక్ కళాశాలల్లో డి-ఫార్మసీ కోర్సు ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి సోమవారం విడుదల చేశారు. -
ఇటొస్తే.. ఇరుక్కున్నట్లే..!
గుంతల రహదారులు రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. రాకపోకలు సాగించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో రహదారుల దుస్థితికి ఈ చిత్రం నిదర్శనం.


తాజా వార్తలు (Latest News)
-
Ap High court: కోడికత్తి కేసు.. కౌంటరు దాఖలు చేసిన ఎన్ఐఏ
-
Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Uttarakhand Tunnel: ఆపరేషన్ టన్నెల్.. క్షేమంగా బయటపడిన 41 మంది కూలీలు
-
1 నుంచి TCS బైబ్యాక్.. 20 శాతం ప్రీమియంతో షేర్ల కొనుగోలు
-
Team India: పెళ్లిపీటలెక్కబోతున్న భారత్ ఫాస్ట్ బౌలర్