కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి.
తిరుపతి ‘ఎలక్ట్రానిక్ క్లస్టర్’పై వైకాపా నేతల దాష్టీకం
అన్నీ తెలిసినా నోరు మెదపని జగన్
అరాచకాలకు బెదిరి ముందుకురాని కొత్త కంపెనీలు
ఉపాధి దొరక్క రోడ్డున పడ్డ నిరుద్యోగులు
ఈనాడు, బిజినెస్ బ్యూరో
కామధేనువు దొరికితే రాక్షసులైనా రాజసంగా చూసుకుంటారు. అలాంటిది... ఉపాధి కల్పనలో కల్పతరువులాంటి ఫ్యాక్టరీలు వస్తే వాటినీ వెళ్లగొట్టేవారినేమనాలి? వైకాపా నేతలనాలేమో! రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్లో సాగుతున్న వ్యవహారం చూస్తే... అదే నిజమనక మానరు మరి!
‘‘మీ కంపెనీలో క్యాంటీన్ కాంట్రాక్టు ఎవరికి ఇస్తున్నారు..? ఇదిగో నా తరఫున ఓ మనిషిని పంపిస్తున్నా.. ఆయనకే ఇవ్వండి’’
‘‘మాకు తెలిసిన పిల్లలు ఉన్నారు. మీ కంపెనీల్లో వారికే ఉద్యోగాలు ఇవ్వండి, పెద్దగా చదువుకోలేదని, అనుభవం లేదని వంకలు పెట్టి పక్కకు నెట్టకండి’’
‘‘కొత్తగా భవనాలు కడుతున్నారు కదా.. ఇసుక, మట్టి పనుల కాంట్రాక్టు మా మనుషులు చేస్తారు, జేసీబీలు కూడా పంపిస్తున్నా.. వారు అడిగిన రేటు ఇచ్చేయండి’’
రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోని కంపెనీలకు వైకాపా నేతల బెదిరింపులు ఇవీ..
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. నిరుద్యోగులకు ఉపాధి చూపడంతోపాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కంపెనీలను ఏ ప్రభుత్వమైనా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది. నిర్వాహకులు అడిగిన సదుపాయాలనూ కల్పిస్తుంది. కానీ జగన్ సర్కారు అంటేనే ‘రివర్స్’ కదా..! ఆయన నిరంకుశ పాలనతో ఈఎంసీలో తమ కంపెనీలు నెలకొల్పాలంటేనే నిర్వాహకులు వణికిపోయారు. జగన్ విధానాలను పుణికిపుచ్చుకున్న వైకాపా నేతలు వారిని రాచిరంపాన పెట్టారు. ‘మేం చెప్పింది చేయాల్సిందే.. లేకుంటే మీ ఇష్టం..’’ అన్నట్లుగా వ్యవహరించారు. వారి బెదిరింపులు, వేధింపులను వేగలేక కొన్ని కంపెనీలు ఇక్కడ తమ ప్లాంట్లను నెలకొల్పడానికి వెనకడుగు వేశాయి. పర్యవసానంగా.. రాష్ట్రంలోని వేలమంది నిరుద్యోగులకు ఉపాధి దూరమైంది.
రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లోని యువతకు వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకే అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఈఎంసీని ప్రతిపాదించారు. వాటికి ప్రభుత్వం భూములు కేటాయించగా.. అందుకు అవసరమయ్యే వనరులు కల్పించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. 2015లో తెదేపా ప్రభుత్వ హయాంలో రేణిగుంట విమానాశ్రయానికి ఎదురుగా ఈఎంసీ-1 (శ్రీవేంకటేశ్వర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్)ను 122 ఎకరాల్లో ప్రారంభించింది. 2019లో ఈఎంసీ-2 క్లస్టర్కు 502 ఎకరాలు కేటాయించింది. అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో ఒప్పందం చేసుకున్నవి మినహా.. జగన్ జమానాలో ఇక్కడికి ఒక్క కొత్త కంపెనీ కూడా రాలేదు. కారణం.. ఇప్పటి వైకాపా సర్కారుకు ఈఎంసీ విస్తరణ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఆసక్తి లేకపోవడమే. గుత్తేదారులకు పనులను కట్టబెట్టడం, తన అనుచరగణానికి లబ్ధిచేకూర్చడంపై జగన్కు ఉన్న శ్రద్ధ.. ఈఎంసీ కార్యకలాపాలపై ఉంటే 50 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించేది. కంపెనీల నిర్వాహకులను ఇబ్బంది పెడుతున్న తమ నేతలను కట్టడి చేసినా ఈ క్లస్టర్ విస్తరించేది. వైకాపా నేతలు పెడుతున్న ఇబ్బందుల గురించి నిర్వాహకులు తాడేపల్లి ప్యాలెస్ దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన లేదు.
2019 వరకు అన్నీ అనుకున్న ప్రకారమే..
2019కు ముందు గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు తమ ప్లాంట్లను నెలకొల్పాయి. కార్బన్, సెల్కాన్ తదితర దేశీయ మొబైల్ ఫోన్ సంస్థలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. ఓపో, రియల్మీ ఫోన్ల తయారీ సంస్థ విన్టెక్, కార్బన్ అనుబంధ సంస్థ నియోలింక్స్, ప్రముఖ బ్రాండ్ల సెల్ఫోన్లకు కెమెరా లెన్స్ తయారు చేసే సన్నీ ఓపోటెక్, యాపిల్ ఉత్పత్తులకు కేబుళ్లు-ఛార్జర్లు తయారు చేసే ఫాక్స్లింక్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఆయా యూనిట్లలో 80% వరకు ఉద్యోగాలను పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికే కేటాయించారు. వారిలోనూ 60% మంది మహిళలే.
ఈఎంసీ-2 క్లస్టర్లో అగ్రశ్రేణి సంస్థలకు స్థలాలు కేటాయించి 2019 ఫిబ్రవరిలో భూమిపూజ చేశారు. అందులో అమెరికా దిగ్గజ టెలికాం సంస్థ అయిన టి మొబైల్కు ఫోన్లు, మరో కంపెనీకి సెట్ టాప్ బాక్సులు తయారు చేసే విన్టెక్ సంస్థలు ప్లాంట్లను నెలకొల్పాయి.
వైకాపా వచ్చాక తారుమారు
2019లో జగన్ సీఎం అయ్యాక రేణిగుంటలోని ఈఎంసీ పరిస్థితి తారుమారైంది. తన సొంత జిల్లా అయిన కడపకు రేణిగుంట కొంత దగ్గరగా ఉన్నందున.. సీఎం జగన్ మరింత శ్రద్ధ వహించి ఈ క్లస్టర్ను అభివృద్ధి చేస్తారని అందరూ ఆశించారు. కానీ, దానికి అంకురార్పణ చేసింది చంద్రబాబునాయుడు కదా..? ఆ కారణంగా జగన్ ఈ పారిశ్రామికవాడను విస్తరించడానికి కాదుకదా.. అసలు గుర్తించడానికే ఇష్టపడలేదు.
- క్లస్టర్లలో కొత్త యూనిట్లను స్థాపించడానికి జగన్కు మనసు రాకపోగా.. అందులోని ప్లాంట్లపై తన పార్టీ నాయకులు వీరంగం సృష్టిస్తున్నా అడ్డుకోలేకపోయారు. దీన్ని ఆసరాగా తీసుకున్న వైకాపా నేతలు కంపెనీ నిర్వాహకులపై రెచ్చిపోయారు. తాము చెప్పినట్లు చేయాలని హుకుం జారీ చేశారు. అడిగినంత ఇచ్చుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. అలా చేయకపోతే లేనిపోని కేసులు పెట్టి వేధించారు.
- రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు టాటా గ్రూపునకు చెందిన వోల్టాస్.. తిరుపతిలో భారీ ఎలక్ట్రానిక్స్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఇంకేం.. వైకాపా పరివారం ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. వారి ఇబ్బందులు, అరాచకాలు తెలుసుకున్న సంస్థలు.. వెనక్కి వెళ్లాయి. విడిభాగాలు తయారు చేసేందుకు యూనిట్లు నెలకొల్పుదామనుకున్న 15 సంస్థలు పారిపోయాయి. ఫాక్స్లింక్ కూడా కొన్ని కార్యకలాపాలను బెంగళూరుకు తరలించేసింది.
- ఈఎంసీ రెండు క్లస్టర్లలో ఏర్పాటయ్యే యూనిట్లతో కనీసం 50,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తొలుత అంచనా వేశారు. కానీ ఇప్పుడు 15,000 మందికి మించి పనిచేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన సంస్థలే ఈ కష్టాలు తట్టుకుని మనుగడ సాగిస్తున్నాయి. జగన్ సర్కారు పుణ్యమా అని ఒక్క కొత్త యూనిట్ కూడా ఏర్పాటు కాలేదు.
- శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో పైపుల తయారీ సంస్థ నిర్వాహకులు కూడా వైకాపా నాయకులు అడిగినప్పుడల్లా ముడుపులు సమర్పించుకున్నారు. అయినా వేధింపులు మానుకోలేకపోయారు. చివరికి వారి ఆగడాలను తాళలేక నిర్వాహకులు ప్లాంటునే మూసి వెళ్లిపోయారు.
- ఇక్కడికి సమీపంలోని శ్రీసిటీ సెజ్లో ఫాక్స్కాన్ సంస్థ గత తెదేపా ప్రభుత్వ హయాంలో 16,000 మందికి ఉద్యోగాలు కల్పించింది. జగన్ సీఎం అయ్యాక ఇక్కడి తన కార్యకలాపాల్లో కొంతభాగాన్ని తమిళనాడుకు తరలించినట్లు సమాచారం. దీంతో స్థానికంగా ఉద్యోగాల సంఖ్య బాగా తగ్గిందని చెబుతున్నారు.
రూ.వేల కోట్ల ఆదాయానికి గండి
గత ఆర్థిక సంవత్సరంలో.. ఈఎంసీలోని డిక్సన్ టెక్నాలజీస్ వార్షిక టర్నోవర్ సుమారు రూ.4,152 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ఫాక్స్లింక్ ఇండియా రూ.756 కోట్లు, సన్నీ ఓపోటెక్ రూ.1,476 కోట్ల టర్నోవర్ నమోదైనట్లు తెలిసింది. కేవలం ఈ మూడు సంస్థల వార్షిక టర్నోవర్ కలిపితేనే సుమారు రూ.6400 కోట్లు ఉంది. అదే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలతోపాటు ప్రస్తుత జగన్ సర్కారు ఇక్కడ మరిన్ని సంస్థలను ఏర్పాటు చేయిస్తే వేల కోట్ల రూపాయల టర్నోవర్ లభించేది. ప్రభుత్వానికీ పన్నుల రూపేణ రూ. కోట్ల ఆదాయం సమకూరేది! కానీ జగన్ నిరంకుశ ధోరణితో ఆ మొత్తం ఆదాయానికి గండిపడింది. ఎలక్ట్రానిక్ సంస్థలకు కీలకమైన సెమీ కండక్టర్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (పీసీబీ) కంపెనీలు కూడా ఏర్పాటైతే.. రాష్ట్రానికి చెందిన వేల మందికి ఉద్యోగాలు లభించేవి. సెమీకండక్టర్ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోంది. ఆ రంగాన్ని అందిపుచ్చుకోవడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారు.
రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంటే జగన్ ఓర్చుకోలేరేమో అని ఇవన్నీ గమనిస్తున్న తిరుపతి ప్రాంత ప్రజలు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం