పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది.
తీవ్రమైన వేడితో జనజీవనం అతలాకుతలం
ఎండలతో ఇళ్లకే పరిమితమవుతున్న కార్మికులు
తగ్గుతున్న ఉత్పాదకత.. పెరుగుతున్న ధరలు
వేడితో రాత్రుళ్లూ నిద్ర కరవు
ఈనాడు, హైదరాబాద్: వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. ఫ్యాను వేస్తే భరించలేని వేడి గాలితో.. బంద్ చేస్తే ఉక్కపోతతో అల్లాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటుతుండటంతో కూలర్లతోనూ ప్రయోజనం ఉండటం లేదు. వారం రోజులుగా తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు సామాన్య జనం ఎదుర్కొంటున్న దయనీయ స్థితి ఇది. ముఖ్యంగా పసిపిల్లలు, బాలింతలు, వృద్ధులు విలవిల్లాడుతున్నారు. రాత్రుళ్లు నిద్రలేక.. పగలు పనులకు వెళ్లలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ ప్రభావం వ్యాపారాలు, నిత్యావసర ధరలపై పడుతోంది.
11 దాటితే వ్యాపారాలు బంద్
ఎండల ధాటికి జనం బయటకు రావడం లేదు. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలకు, హైదరాబాద్ నగరానికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయి. మధ్యాహ్నమైందంటే.. హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లలో చిరువ్యాపారులు, ఆటోవాలాలు కనిపించడం లేదు. దీంతో సంపాదన తగ్గి కుటుంబ అవసరాలకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థ సైతం మధ్యాహ్నం సర్వీసులను తగ్గించింది.
తల్లడిల్లుతున్న చిన్నారులు.. వృద్ధులు
అర్ధరాత్రుళ్లూ వడగాలి వీస్తుండటంతో పిల్లలు నిద్రపోవడం లేదు. పసిపిల్లలు ఉక్కపోతతో గుక్కపట్టి ఏడుస్తున్నారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. రాత్రిపూట సాధారణం కన్నా 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సమశీతోష్ణ మండలమైన హైదరాబాద్ పరిధిలో 22 డిగ్రీల్లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా, వారం రోజులుగా 28.4 డిగ్రీలపైనే ఉంటోంది.
10.30 గంటల వరకే కూలి పనులు
ప్రస్తుతం పంటలు లేక కూలి పనులే దిక్కైన తరుణంలో ఎండలు తీరని వ్యథ మిగుల్చుతున్నాయని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డాలపైకి వచ్చే కూలీలు కూడా నీడపట్టున ఉన్న పనులకే మొగ్గుచూపుతున్నారని మేస్త్రీలు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ఉదయం 10.30 గంటలకే బంద్ అవుతున్నాయి. తీవ్రమైన వేడితో పలుగు, పార, ఇనుప బొచ్చెలు కాలిపోతుండటంతో పనులు చేయలేకపోతున్నారని ఉపాధి సిబ్బంది చెబుతున్నారు.
ఆకుకూరల ధరలు ఆకాశానికి
ప్రాజెక్టులు ఎండిపోవడం, బోర్లు వట్టిపోవడంతో కూరగాయల సాగు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఎండలకు పండిన అరకొరా ఇట్టే వాడిపోతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి నగరంలోని ఎల్బీనగర్, బోయినపల్లి, కొత్తపేట ప్రాంతాలకు కూరగాయలు, ఆకుకూరల రాక తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఆకుకూరలు తెచ్చేలోపే వడలిపోతుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదంటూ ఉప్పల్ ప్రాంతానికి చెందిన మమత అనే కూరగాయల విక్రయదారు తెలిపారు.
కూలర్లు గిరగిరా...
వేడి నుంచి ఉపశమనానికి ప్రజలు పెద్దఎత్తున కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ఏటా ప్రతి వేసవిలో దాదాపు 120 కూలర్లు విక్రయిస్తుండగా.. ఈ ఏడాది ఇప్పటికే 150 అమ్ముడుపోయాయని, మళ్లీ కర్ణాటకకు ఆర్డర్ పెట్టానని రామంతాపూర్కు చెందిన కరుణాకర్ అనే విక్రయదారుడు తెలిపారు. ఇళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు కూలర్లు నడుస్తూనే ఉంటున్నాయి. దీంతో కరెంటు బిల్లు తడిసి మోపెడవడంతోపాటు నీరు సైతం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేసినా కూలర్లతో కాసింత ఉపశమనమే ఉంటోందని వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM