జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి.
రూ.20 కోట్ల ఆర్టీసీ సొమ్ముతో జగన్కు రెండు కొత్త బుల్లెట్ ప్రూఫ్ బస్సులు
పాతవి ఉన్నా... పక్కకు నెట్టి!
ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలును పట్టించుకోని ప్రభుత్వం
మూడుసార్లు ఛార్జీలు పెంచి ఏటా రూ.2 వేల కోట్ల భారం
నిత్యం ప్రయాణించే 40 లక్షల మందికి తుక్కు బస్సులే
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..
నా ఇచ్ఛయేగాక నాకేటి వెరపు..
అన్నట్టుగా ఉంది సీఎం జగన్ తీరు!
స్టీరింగ్ ఊడిపోయే.. చక్రం జారిపోయే..
డొక్కు ఆర్టీసీ బస్సుల్లోనే సామాన్యులంతా ప్రయాణిస్తుంటే..
వారి కోసం కొత్త బస్సులు కొనకుండా..
కేవలం తన ఎన్నికల ప్రచారం కోసం అదే ఆర్టీసీతో రూ.20 కోట్లు పెట్టించి కొత్తగా రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్ని ‘సిద్ధం’ చేయించుకున్నారీ హై‘టెక్కు’ సీఎం! ఇప్పటికే ఉన్న రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్ని పక్కనబెట్టడం ఇక్కడ కొసమెరుపు!
- ఐదేళ్ల తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం జగన్ జనంలోకి వచ్చారు. అయితే సీఎం కోసం ఆర్టీసీ వద్ద రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిని వినియోగించుకోకుండా.. రూ.20 కోట్లు వెచ్చించి కొత్తగా రెండు బుల్లెట్ ఫ్రూఫ్ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయించారు. ఆ బస్సులోనే ‘మేమంతా సిద్ధం’ అంటూ యాత్ర చేస్తూ మండు వేసవిలోనూ ఎన్నికల ప్రచారాన్ని చల్లగా సాగిస్తున్నారు.
- మరి నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 40 లక్షల మంది ప్రజల భద్రత గురించి జగన్ తన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కసారైనా పట్టించుకున్నారా? డొక్కు బస్సులతో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. గమ్యస్థానానికి భద్రంగా చేరుకుంటామనే భరోసా లేకుండా... బిక్కుబిక్కుమంటూ రోజూ ప్రయాణిస్తున్నారు. ప్రజలవద్దకు చుట్టపుచూపుగా వెళ్లే జగన్కు హైటెక్ బస్సులు కావాలి గానీ.. సామాన్యులు రోజూ ప్రయాణించడానికి కొత్త బస్సులు వద్దా?
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. అలాగైతేనే ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు పాటించినట్లు అవుతుంది’ అని సీఎం జగన్.. 2019, నవంబరులో ఓ సమీక్షలో పేర్కొన్నారు. తర్వాత ఆ సంగతే మర్చిపోయారు. ప్రస్తుతం ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన బస్సులు 4,815 ఉన్నాయి. తన హయాంలో మూడు సార్లు ఛార్జీలు పెంచి, ప్రయాణికులపై ఏటా రూ.2 వేల కోట్లు భారం వేసిన జగన్.. కొత్త బస్సులు కొనకుండా ‘మీ చావు మీరు చావండి’ అనేలా జనాల్ని వదిలేశారు.
ప్రాణాలతో చెలగాటం..
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే నమ్మకం.. జగన్ పాలనలో సన్నగిల్లింది. స్టీరింగ్ పట్టేయడం, ఏకంగా స్టీరింగ్ ఊడిపోయి డ్రైవర్ చేతికి వచ్చేయడం, బ్రేకులు పడకపోవడం, గేర్ బాక్స్ పట్టేయడం, యాక్సిల్తో సహా చక్రాలు ఊడిపోయి బస్సు నుంచి వేరవ్వడం, బస్సంతా డబడబమంటూ శబ్దాలు రావడం.. తదితరాలతో అత్యధిక బస్సులు డొల్లగా మారిపోయాయి. వీటికి మరమ్మతులు చేయలేమని మెకానిక్లు గోల పెడుతున్నా... అధికారులు ఒత్తిడిచేసి ఏదో ఒకలా సరిచేయించి వాటినే పంపుతున్నారు. ఇవి నిత్యం ఎక్కడో ఓచోట పంటకాల్వలు, పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడుతున్నాయి. అయినాసీఎం జగన్లో ఎటువంటి చలనంలేదు.
15 లక్షల కి.మీ. దాటినా తిప్పాల్సిందే
ఆర్టీసీకి సొంత బస్సులు 8,369 ఉన్నాయి. ఇందులో 10 లక్షల కి.మీ.కు పైగా తిరిగిన బస్సులు 5,942 ఉన్నాయి. ఆర్టీసీ నిబంధనల ప్రకారం దూర ప్రాంత సర్వీసుల్లో 10 లక్షల కి.మీ. దాటితే వాటి స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టాలి. అలాగే 10 లక్షల కి.మీ. తిరిగిన బస్సులను పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ సర్వీసులుగా మార్పు చేసి 12 లక్షల కి.మీ. వరకు నడపాలి. ఆ తర్వాత వాటిని తుక్కు చేయాల్సి ఉంటుంది. కానీ ఐదేళ్లుగా ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు లేకపోవడంతో 15 లక్షల కి.మీ.పైగా తిరిగిన బస్సులను నడుపుతున్నారు.
పల్లె బస్సులు మరీ ఘోరం
గ్రామీణుల కోసం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులను నడుపుతారు. అయితే ఇవన్నీ ఘోరంగా ఉంటున్నాయి.
- 15 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన బస్సులు 2,119 ఉంటే.. అందులో 1,809 పల్లెవెలుగు సర్వీసులే!
- విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో తిరుగుతున్న సిటీ సర్వీసుల్లో సైతం 134 బస్సులు 15 లక్షల కి.మీ.పైనే తిరిగాయి.
- దూర ప్రాంతాలకు తిరిగే సూపర్ లగ్జరీ బస్సుల్లో 15 లక్షల కి.మీ. దాటినవి 105 ఉన్నాయి.
ఛార్జీలు పిండేస్తున్నా.. కొత్త బస్సుల్లేవ్!
జగన్ సీఎం అయ్యాక తొలుత 2019 డిసెంబరులో.. డీజిల్, విడిభాగాలు, టైర్ల ధరలు పెరిగాయని, ఉద్యోగుల జీతాల రూపంలో భారం పడుతోందని చెప్పి.. ఛార్జీలు పెంచి ప్రయాణికులపై ఏటా రూ.700 కోట్ల చొప్పున భారం వేశారు. తర్వాత 2022 ఏప్రిల్లో డీజిల్ సెస్ పేరిట ఛార్జీలు పెంచేసి, ఏటా రూ.750 కోట్ల చొప్పున బాదేశారు. మళ్లీ మూడు నెలలకే మరోసారి డీజిల్ సెస్ అంటూ ఛార్జీలు పెంచి ఏడాదికి రూ.550 కోట్ల మేర భారం వేశారు. మొత్తంగా మూడుసార్లు కలిపి ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున ప్రయాణికుల నుంచి పిండేస్తున్నారు.
ఘాట్లో ప్రమాదకర ప్రయాణం
తిరుపతి-తిరుమల ఘాట్లో నిత్యం వేల మంది శ్రీవారి భక్తులు ప్రయాణిస్తుంటారు. ఈ బస్సులు పూర్తిగా కండిషన్లో ఉండాలి. కానీ ఇక్కడా కాలం చెల్లిన బస్సులను నడుపుతూ భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
- నిబంధనల ప్రకారం 7 లక్షల కి.మీ. తిరిగిన బస్సులను ఘాట్ సర్వీసుల నుంచి పక్కనపెట్టాలి. కానీ ప్రస్తుతం నడుపుతున్న వాటిలో మూడింట రెండొంతులు కాలం చెల్లినవే ఉన్నాయి.
- తిరుపతి జిల్లాలోని వివిధ డిపోల పరిధిలో 320, చిత్తూరు జిల్లాలోని 26, అన్నమయ్య జిల్లాలోని ఒకటి కలిపి మొత్తం 347 ఘాట్ సర్వీస్ బస్సులు ఉన్నాయి. ఇందులో 7 లక్షల కి.మీ.కుపైగా తిరిగేసిన బస్సులు 237 ఉన్నాయంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది.
రాబడి తీసేసుకుంటూనే
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకొని.. వారికి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోందంటూ జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ ఆర్టీసీకి నెలకు సగటున రూ.600 కోట్ల వరకు రాబడి వస్తుండగా, అందులో రూ.125 కోట్లను (25%) ప్రభుత్వం తన ఖజానాలో జమ చేయించుకుంటోంది. దీంతో ఆర్టీసీ వద్ద కొత్త బస్సుల కొనుగోళ్లకు నిధులు ఉండటంలేదు.
పొరుగు ఆర్టీసీల్లో అధునాతన బస్సులు
తెలంగాణ, కర్ణాటక ఆర్టీసీలూ అధునాతన బస్సులను అందుబాటులోకి తెచ్చి, ప్రజలకు మంచి రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వాటి ముందు తేలిపోతున్నాయి. కొవిడ్ మొదటి దశకు ముందు 300 బస్సులను కొనుగోలు చేశారు. కొత్తగా 1,500 డీజిల్, 1,000 విద్యుత్ బస్సులు కొనుగోలు చేయడంతోపాటు 200 పాత డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చి... వినియోగించనున్నట్లు ప్రభుత్వం ఏడాదిగా చెబుతోంది. 1,500 బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టినా.. వీటిలో 200 మాత్రమే ఇప్పటివరకు వచ్చాయి.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన