Vijayawada: 3 గంటలకు కోడ్‌.. 12 గం.లకు ఇళ్ల పంపిణీ

విజయవాడ జక్కంపూడి వద్ద తెదేపా హయాంలో టిడ్కో గృహాలు నిర్మించారు. వాటిలో వసతులు కల్పించాల్సి ఉంది.

Updated : 17 Mar 2024 07:36 IST

విజయవాడ జక్కంపూడి వద్ద తెదేపా హయాంలో టిడ్కో గృహాలు నిర్మించారు. వాటిలో వసతులు కల్పించాల్సి ఉంది. ఆ పనులు వదిలేసిన వైకాపా పాలకులు భవనాలకు పార్టీరంగులు వేసుకొని, ఇన్నాళ్లు పక్కన పెట్టారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కోడ్‌ వస్తుందనగా.. 12 గంటలకు ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఆఘమేఘాల మీద విజయవాడలో సమావేశం పెట్టి వాటి పట్టాలను పంపిణీ చేశారు. పైగా.. రెండు మూడు నెలల్లోగా వసతులు కల్పిస్తామని వెలంపల్లి చెప్పడం కొసమెరుపు.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని