జగన్ పాలనలో అకా‘డమ్మీలు’!
రాష్ట్రంలో సంస్కృతి, సాహిత్యం, సంగీతం, నృత్యం, హరికథ, బుర్రకథ... తదితరాలకు పూర్వవైభవం కల్పించడానికి వైకాపా ప్రభుత్వం ప్రత్యేకంగా అకాడమీలకు అంకురార్పణ చేసింది.
రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన వైనం
వైకాపా హయాంలో వన్నెతగ్గిన కళలు, సాహిత్యం, సంగీతం
చరిత్ర, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ రంగాలదీ అదేబాట
కళలు, సాహిత్యం, సంగీతం...
ఇవి ప్రజల్లో చైతన్యం రగిలించే మాధ్యమాలు!
చరిత్ర, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ...
గతాన్ని మననం చేసుకుని...
వర్తమానంతో పోల్చుకుంటూ...
భవిష్యత్తుకు పటిష్ఠ అడుగులు వేసేందుకు బాటలుపరిచే రంగాలివీ...
జనజాగృతంలో కీలకపాత్ర పోషిస్తూ సమాజానికి దిశానిర్దేశం చేయడంలో ముఖ్య భూమిక వహించాల్సిన ఈ రంగాలు, మాధ్యమాలను జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. వాటికి జవసత్వాలు కలిగించాల్సిన అకాడమీలను డమ్మీలుగా తయారు చేసింది... ఫక్తు.. రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసింది.
రాష్ట్రంలో సంస్కృతి, సాహిత్యం, సంగీతం, నృత్యం, హరికథ, బుర్రకథ... తదితరాలకు పూర్వవైభవం కల్పించడానికి వైకాపా ప్రభుత్వం ప్రత్యేకంగా అకాడమీలకు అంకురార్పణ చేసింది. వీటిని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో జగన్ సర్కారు చూపిన చొరవను చూస్తే ఆయా రంగాలకు ఇక మహర్దశ పట్టినట్లేనన్న భావన కలిగింది. రాష్ట్రంలో సంస్కృతి కొత్త పుంతలు తొక్కనుందని, సాహిత్యానికి కొత్త పుటలు చేరతాయని, సంగీతం సరికొత్త పల్లవిని ఎత్తుకుంటుందని.. కళలు తళుకులీనుతాయని ఆశలు కలిగాయి. కానీ... అదంతా భ్రాంతియే అని తెలుసుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. వైకాపా ప్రభుత్వం అకాడమీలను ఉత్సవ విగ్రహాలుగా చేసి, వాటిని రాజకీయ కేంద్రాలుగా మార్చేయడమే ఇందుకు కారణం.
అద్దె భవనంలో ఏడు సంస్థలు
కళలు, సాహిత్యం, సంస్కృతి తదితరాలకు జవసత్వాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య, సంగీత నృత్య, నాట్య, జానపద-సృజనాత్మకత, దృశ్య కళ, సైన్స్ అండ్ టెక్నాలజీ, చరిత్ర అకాడమీలను ఏర్పాటు చేసింది. ఏడు అకాడమీలకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించింది. జీతభత్యాల కింద నెలకు ఒక్కో ఛైర్మన్కు రూ.1.20 లక్షలు, ఒక్కో డైరెక్టర్కు రూ.12 వేల చొప్పున ఇస్తోంది. కానీ, అసలు లక్ష్యం మరచి... అకాడమీలను అడ్డంపెట్టుకుని తమ పార్టీ నేతలకు పదవులు కట్టబెట్టి జీతభత్యాల ద్వారా లబ్ధిచేకూర్చింది. క్రియేటివ్ హెడ్ అంటూ మరో పోస్టును సృష్టించి ఆ పార్టీవారికి ఉపాధి కల్పించింది. ఈ అకాడమీలన్నింటినీ విజయవాడలోని ఒక అద్దె భవనంలో కొలువుదీర్చింది. అంతకుమించి కళలకు జీవం పోసింది లేదు. సాహిత్యానికి మేలు చేకూర్చిందీ లేదు. వాటి అభివృద్ధికి నిధులు ఇచ్చింది అంతకన్నా లేదు. తరచి చూస్తే ఆ అకాడమీల ద్వారా జగన్ ప్రభుత్వం ఏ ఒక్క రంగాన్ని కూడా ఉద్ధరించింది లేదు.
తెలంగాణలో 200 పుస్తకాల ముద్రణ
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆ రాష్ట్రంలో 2017వ సంవత్సరం నుంచి ఇటీవల వరకు 200 పుస్తకాలను ముద్రించింది. ప్రజలు, విద్యార్థులకు గ్రామాల చరిత్రపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో డిగ్రీ విద్యార్థులను కలుపుకొని ‘మన ఊరు- మన చరిత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థులతోనే గ్రామ చరిత్ర రాయించే ప్రయత్నం చేసింది. ఏపీలో మాత్రం ఈ అకాడమీలో ఎలాంటి కార్యక్రమం, కార్యాచరణ చేపట్టింది లేదు.
ఏం చేయాలి? ఏం చేస్తోంది...?
- తెలుగు భాష మాండలికాలను గుర్తించి ప్రోత్సహించడంతోపాటు వాటిని భావితరాలకు అందించేందుకు సాహిత్య అకాడమీ చర్యలు తీసుకోవాలి. సాహిత్య పరిరక్షణ, పుస్తకాల ముద్రణలోపాటు ప్రజలు, విద్యార్థుల్లో పఠనాన్ని మెరుగుపర్చాలి. అయితే... జగన్ పాలనలో సాహిత్యమంటే ప్రతిపక్షాలపై బూతులతో విరుచుకుపడడంగా మారింది. ఎంత ఎక్కువ తిడితే అంత గొప్ప. ఆయన ఇదే సాహిత్యం అనుకున్నారేమో! అందుకే సాహిత్య అకాడమీకి నిధులివ్వకుండా దాన్ని మూలకుపడేశారు.
- తోలు బొమ్మలాట, హరికథ, బుర్రకథ వంటి జానపద కథలు కనుమరుగవుతున్నాయి. ఆలయ, జాలరి, థింసా, సవర, గదబ, కోయ, లంబాడాల నృత్య రూపాలు ప్రాభవం కోల్పోతున్నాయి. ఆదివాసీలు, ఇతర సంచార సమూహాల సంప్రదాయ సంగీతం, నృత్య రూపకాల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. వీటి పరిరక్షణకు సంగీత, నృత్య అకాడమీ పనిచేయాలి. అసలు దీని ఉనికే ప్రశ్నార్థకమైంది.
- పద్య నాటకం, యక్షగానం, వీధి భాగవతం లాంటి సంప్రదాయ థియేటర్ రూపాలను పరిరక్షించడం, వాటిని ప్రోత్సహించడం నాటక అకాడమీ బాధ్యత. దీనికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఈ అకాడమీ ఉసూరుమంటోంది.
- ఆధునిక సమాజాన్ని ఆకర్షించేలా డప్పులు, తప్పెటగుళ్లు, గరగల వంటి జానపద కళారూపాలకు జీవం పోయాలన్న ఉద్దేశంతో జానపద, సృజనాత్మకత అకాడమీని సర్కారు ఏర్పాటు చేసింది. వడ్రంగి, కుమ్మరి, బుట్టలు, ఇటుకల తయారీ తదితర చేతివృత్తుల వివరాలను సేకరించి, భద్రపరచడం కూడా దీని విధే. ఈ అకాడమీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలే లేదు.
- పెయింటింగ్, గ్రాఫిక్స్ వంటి ఫైన్ ఆర్ట్స్ రంగాలపై అధ్యయనం చేసే పరిశోధకులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన దృశ్య కళ అకాడమీ నిస్తేజంగా మారిపోయింది. అమరావతి, కళింగ, ఇతర దృశ్య కళలు, చారిత్రక వైభవాన్ని కాపాడుకునేందుకు ఈ అకాడమీ కృషి చేయాలి. రాతి, చెక్కబొమ్మలు, శిల్పాలు, కలంకారీ, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, హస్తకళ రూపాలను ప్రోత్సహించాల్సి ఉన్నా నిధుల్లేక అడుగు ముందుకు పడని దుస్థితి నెలకొంది.
- పిల్లలు, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఉనికి కోల్పోతోంది.
- వివిధ ప్రాంతాల సాంస్కృతిక వారసత్వాన్ని వెలికితీయడానికి ప్రయత్నించాల్సిన చరిత్ర అకాడమీ వైకాపా వారికి ఉపాధి కల్పన కేంద్రంగా మారింది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు రూ.55 లక్షల జరిమానా
బోధన నిపుణుల కొరత, ఇతర లోపాల కారణంగా రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) జరిమానాలు విధించింది. ఎంబీబీఎస్ సీట్లు, ఇతరత్ర వాటి గుర్తింపు పునరుద్ధరణకు కళాశాలల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ఎన్ఎంసీ అధికారులు పలు లోపాలు గుర్తించారు. -
నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన
సుమారు రెండు నెలలకు పైగా ఎన్నికల ప్రచారం కోసం వరుస పర్యటనలతో తలమునకలైన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు.. -
‘పది’లో ఈ ఏడాది సీబీఎస్ఈ పాఠ్యపుస్తకాలు
రాష్ట్రంలో ఈ ఏడాది పదో తరగతి సిలబస్ మొత్తం మారిపోయింది. పాత పాఠ్యపుస్తకాలు పూర్తిగా మారాయి. 2023-24 వరకు రాష్ట్ర సిలబస్ పాఠ్యపుస్తకాలు ఉండగా.. 2024-25 విద్యా సంవత్సరానికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ-సీబీఎస్ఈ) సిలబస్ పాఠ్యపుస్తకాలను ముద్రించారు. -
ఇదీ సంగతి
-
వానలతో చల్లబడిన వాతావరణం
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని రోజుల క్రితం వరకు ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన రాష్ట్రం చల్లబడింది. -
పశువైద్య సేవలకూ..వినియోగ రుసుములు?
పశు సంవర్ధక శాఖలో వినియోగ రుసుముల బాదుడుకు సర్కారు రంగం ‘సిద్ధం’ చేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీనిపై కార్యాచరణ రూపొందించి అమలు చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు