ముస్లింల సంక్షేమంపై సీఎం మాట్లాడరేం?

ముస్లింల సంక్షేమంపై సీఎం జగన్‌ ఎలాంటి భరోసా కల్పిస్తారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ ప్రశ్నించారు.

Updated : 29 Apr 2024 06:28 IST

మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ముస్లింల సంక్షేమంపై సీఎం జగన్‌ ఎలాంటి భరోసా కల్పిస్తారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ ప్రశ్నించారు. మొగల్రాజపురంలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత తెదేపా ప్రభుత్వంలో ఎన్డీయే కూటమిలో ఉండి కూడా చంద్రబాబు ముస్లింల రిజర్వేషన్లు కాపాడడానికి కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. మళ్లీ అదే కూటమితో ఉన్నా.. వారి సంక్షేమానికి చంద్రబాబు భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై వైకాపా నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ముస్లిం సమాజం గుర్తించిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు