Bandi Sanjay: బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ భాజపా చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.
కార్యాలయ తలుపులు పగలగొట్టి అరెస్టు చేసిన పోలీసులు
తోపులాటలో గాయపడ్డ నాయకులు, కార్యకర్తలు
ఈనాడు డిజిటల్, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ భాజపా చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఆదివారం రాత్రి కరీంనగర్లోని ఎంపీ కార్యాలయం వద్ద వేదికను ఏర్పాటు చేసి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టాలనుకున్న ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాగోలా కార్యాలయంలోకి చేరుకున్న సంజయ్ గేటుకు తాళం వేసుకొని దీక్ష ప్రారంభించారు. రాత్రి 10.30 గంటలకు పోలీసులు తలుపులు పగలగొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరు సరికాదని.. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సంజయ్ హెచ్చరించారు.
జాగరణ దీక్షకు మద్దతుగా జిల్లాల నుంచి వస్తున్న నాయకుల్ని పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుని ఠాణాలకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, భాజపా నాయకులకు మధ్య పలుమార్లు తోపులాటలు జరిగాయి. బలవంతంగా వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో కొందరు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నారంటూ కార్యకర్తలంతా సమీపంలోని ఓ రోడ్డువైపునకు ఒక్కసారిగా పరుగెత్తారు. దీంతో పోలీసులు కూడా వారి వెనకాలే వెళ్లడంతో మరోమార్గం నుంచి వచ్చిన సంజయ్ను నాయకులు, కార్యకర్తలు కార్యాలయం లోపలికి ఎత్తుకుని తీసుకెళ్లారు. కార్యకర్తలు గేటుకు తాళం వేయగా.. సంజయ్ జాగరణ దీక్షను ప్రారంభించారు. దీంతో కార్యకర్తల్ని నిలువరించి.. పోలీసులు కార్యాలయ గేటు తాళాన్ని పగలగొట్టారు. అప్పటికే లోపల ఉన్న శ్రేణులు తమ నాయకుడిని అరెస్టు చేస్తే పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా అగ్నిమాపక శకటాన్ని తెప్పించి కార్యాలయం లోపల నీళ్లు చల్లించారు. రాత్రి 10:30 గంటలకు గేటును దాటి తలుపులు, అద్దాలు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి సంజయ్ను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన తలకు గాయమైనట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. సంజయ్ని మానకొండూర్ పోలీస్స్టేషన్కు తరలించగా అక్కడే దీక్ష కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
ఎంపీ కార్యాలయ ద్వారాలు పగలగొడుతున్న పోలీసులు
ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: సంజయ్
ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార గర్వంతో సీఎం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, శాంతియుతంగా తాము చేస్తున్న జాగరణ దీక్షను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ల కార్యక్రమాలకు కొవిడ్ నిబంధనలు వర్తించవా..? అని అడిగారు. తన పార్లమెంట్ కార్యాలయం వద్ద పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా సిబ్బంది గాయపడ్డారని.. ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న దీక్షను బలవంతంగా ఆపడం సరైనది కాదన్నారు. పోలీసుల ప్రవర్తనను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని.. సభాహక్కుల ఉల్లంఘన నోటీసుల్ని ఇచ్చేలా చూస్తామని సంజయ్ తెలిపారు.
* సంజయ్ అరెస్టును భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ తీవ్రంగా ఖండించారు. సంజయ్ పట్ల పోలీసులు క్రూరంగా, అమానవీయంగా వ్యవహరించారని మండిపడ్డారు.
* సంజయ్ అరెస్టు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. సంజయ్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ. కనీస గౌరవం లేకుండా.. గేటు విరగ్గొట్టి పోలీసులు లోపలికి వెళ్లడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. నిరసన హక్కుని రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోంది’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!