ITR: 31 లక్షల మంది రిఫండ్లకు దూరం.. ఇ-వెరిఫై చేయని ఫలితం!
Income Tax Refund: ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. కొందరు మాత్రం ఇ-వెరిఫై చేయటం మరచిపోయారు. అలాంటి వారిని అప్రమత్తం చేస్తూ ఐటీశాఖ ట్వీట్ చేసింది.
ఇంటర్నెట్డెస్క్: పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత 30 రోజుల్లోగా ఇ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. అప్పుడే ఐటీ శాఖ రిటర్నులను ప్రాసెస్ చేస్తుంది. ఈ ఏడాది చాలా మంది రిటర్నులు దాఖలు చేసినా.. లక్షల సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ఇ-వెరిఫై చేయడం మరిచిపోయారు. దీంతో వీరికి రిఫండ్ సొమ్ము ఖాతాల్లోకి జమ ఆలస్యం కానుంది. ఆగస్టు 23 నాటికి 31 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఇ- వెరిఫై చేయలేదని ఐటీ శాఖ వెల్లడించింది.
ఆదాయ పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 23 నాటికి 6.91 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. అందులో 6.59 కోట్ల మందికి మాత్రమే తమ రిటర్నులను ఇ-వెరిఫై చేశారు. ఇంకా 31 లక్షల మంది వెరిఫికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఆదాయ పన్ను శాఖ రిటర్ను దాఖలు చేసిన వారిని అప్రమత్తం చేస్తూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసింది. ‘మీ ఇ-వెరిఫికేషన్ ప్రాసెస్ను ఈ రోజే పూర్తి చేయండి. రిటర్నులు దాఖలు చేసిన 30 రోజుల్లోగా వెరిఫికేషన్ చేయకపోతే ఆలస్య రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యం వద్దు’ అంటూ అప్రమత్తం చేసింది. 30 రోజుల్లోపు ఇ-వెరిఫికేషన్ పూర్తిచేయకుంటే రిఫండ్లు ఆలస్యం అవ్వడమే కాకుండా రిటర్నులను సైతం ఇన్వ్యాలీడ్గా పరిగణిస్తారు. వెరిఫికేషన్ ఆలస్యం చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
టీవీఎస్ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జింగ్తో 140 km
ఇ-వెరిఫికేషన్ ఇలా..
- ‘Income Tax e-filing’ పోర్ట్లోకి వెళ్లి అకౌంట్లో లాగిన్ అవ్వాలి.
- ‘e-Verify Return’ ఆప్షన్ ఎంచుకోవాలి.
- మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఇ- వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.