Ajay Goel: ఆరు నెలల్లోనే వేదాంతకు తిరిగొచ్చిన అజయ్ గోయల్
Ajay Goel: 2021 అక్టోబర్ 23 నుంచి 2023 ఏప్రిల్ 9 వరకు వేదాంత సీఎఫ్ఓగా పనిచేశారు. తాజాగా మళ్లీ అదే సంస్థలో.. అదే హోదాలో ఆయన చేరనున్నారు.
దిల్లీ: ప్రముఖ ఆర్థిక నిపుణుడు అజయ్ గోయల్ (Ajay Goel).. మైనింగ్ దిగ్గజం వేదాంత (Vedanta)లో తిరిగి చేరనున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక కీలక దశలో ఉన్న తరుణంలో ఆయన పునరాగమనం చేయడం గమనార్హం. అక్టోబర్ 30 నుంచి ఆయన విధుల్లో చేరనున్నట్లు కంపెనీ ప్రకటించింది. గోయల్ (Ajay Goel) ఈ ఏడాది ఏప్రిల్లోనే కంపెనీని వీడి ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ (BYJU'S)లో చేరారు.
దేశంలోనే ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీగా పేరుగాంచిన అజయ్ గోయల్ అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో పనిచేశారు. జనరల్ ఎలక్ట్రిక్, నెస్లే, కోకా కోలా సహా మరికొన్ని కంపెనీల్లో కీలక హోదాల్లో విధులు నిర్వర్తించారు. 2021 అక్టోబర్ 23 నుంచి 2023 ఏప్రిల్ 9 వరకు వేదాంత (Vedanta) సీఎఫ్ఓగా పనిచేశారు. తాజాగా మళ్లీ అదే హోదాలో చేరనున్నారు. వేదాంత (Vedanta)ను ఆరు నమోదిత కంపెనీలుగా విభజించనున్నట్లు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. కంపెనీ పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. లోహ, విద్యుత్తు, అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాలను విభజించి ప్రత్యేక నమోదిత సంస్థలుగా లిస్ట్ చేయనున్నారు.
వేదాంత (Vedanta)ను వీడి బైజూస్ (BYJU'S)లో సీఎఫ్ఓగా చేరిన గోయల్ కేవలం ఆరు నెలలు మాత్రమే అక్కడ పనిచేశారు. బైజూస్ ఇంకా సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు రుణాల చెల్లింపులో కంపెనీ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. కార్యకలాపాల నిర్వహణకు కావాల్సిన నిధుల సమీకరణలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆయన కంపెనీని వీడడం పెద్ద ఎదురు దెబ్బ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.