బ్యాంకులకు ₹6వేల కోట్ల మోసం.. ఐటీఎన్ఎల్ సంస్థపై సీబీఐ కేసు
దేశంలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో ఐటీఎన్ఎల్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. కంపెనీ బోర్డు డైరెక్టర్ల అవగాహనతోనే ఈ మోసం జరిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
దిల్లీ: ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ లిమిటెడ్ (ITNL) సంస్థతో పాటు, ఆ కంపెనీ డైరెక్టర్లపై సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. 2016 - 2018 మధ్య కాలంలో 19 బ్యాంకులను ₹6,524 కోట్ల మోసం చేశారంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఐటీఎన్ఎల్ మోసం చేసిన బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్లతోపాటు మరికొన్ని బ్యాంక్లు ఉన్నాయి. 2018లో ఐటీఎన్ఎల్ దివాలా ప్రక్రియను ప్రకటించిగా.. అదే ఏడాది ఎన్సీఎల్టీ (NCLT) కంపెనీ పాత బోర్డ్ మెంబర్ల స్థానంలో కొత్త వారిని నియమించింది. దీంతో వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థకు అనుబంధంగా 348 కంపెనీలు ఉన్నాయి.
సుమారు ₹6,524 కోట్ల ప్రజల సొమ్మును ఐటీఎన్ఎల్ సంస్థ పక్కదారి పట్టించిందని గతంలో సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో కెనరా బ్యాంక్ పేర్కొంది. కంపెనీ డైరెక్టర్లను వైట్కాలర్ నేరగాళ్లతో పోలుస్తూ.. వారంతా పూర్తి అవగాహనతోనే ఈ నేరానికి పాల్పడ్డారని ఆరోపించింది. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో రంగంలోకి దిగిన సీబీఐ విచారణ చేపట్టింది. ఐటీఎన్ఎల్ సంస్థ తన ఆదాయాన్ని ఎక్కువగా చూపుతూ, నిధులను మళ్లించిందని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ సంస్థ ఇతర కంపెనీలకు బదిలీ చేసిన నగదు మొత్తానికి సంబంధించి కంపెనీ సాఫ్ట్వేర్లో ఎలాంటి ఎంట్రీలు చేయలేదని ఆరోపించింది. సబ్-కాంట్రాక్టర్ల నుంచి ఎక్కువ మొత్తానికి నకిలీ కొటేషన్లు తీసుకుని 459 టన్నుల స్టీల్, టైర్లు కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ఇలాంటి మరెన్నో మోసపూరిత లావాదేవీలతో ₹6,524 కోట్ల నిధులను పక్కదారి పట్టించిందని తెలిపింది. ఈ వ్యవహారం మొత్తం బోర్డు డైరెక్టర్ల అవగాహనతో జరిగిందని ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్