Sam Bankman Fried: ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’ బ్యాంక్మన్ ఫ్రీడ్ అరెస్ట్
ప్రముఖ క్రిప్టో సంస్థ ఎఫ్టీఎక్స్ దివాలాతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నష్టపోయారు.
న్యూయార్క్: దివాలా తీసిన క్రిప్టో (cryptocurrency) సంస్థ ఎఫ్టీఎక్స్ (FTX) మాజీ సీఈఓ శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ (Sam Bankman-Fried)ను సోమవారం బహమాస్లో పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా ప్రభుత్వం, బహమాస్ దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. ఎఫ్టీఎక్స్ (FTX) పతనం తర్వాత ఆయనపై ఇరు దేశాల్లో పలు ఆర్థిక నేరాల కింద అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే.
‘హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ’ ముందు హాజరుకావాల్సిన ఒకరోజు ముందే ఫ్రీడ్ (Sam Bankman-Fried)ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఆయన్ని వెంటనే అమెరికాకు అప్పగిస్తామని బహమాస్ అటార్నీ జనరల్ ర్యాన్ పిండర్ తెలిపారు. అలాగే తాము కూడా ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘించి, ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ ఎఫ్టీఎక్స్ (FTX) పతనానికి కారణమైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టడానికి యూఎస్తో కలిసి పనిచేస్తామని బహమాస్ ప్రధాని ఫిలిప్ డేవిస్ తెలిపారు. మరోవైపు అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సైతం ఆయనపై కేసు నమోదు చేస్తామని తెలిపింది. అమెరికా సెక్యూరిటీ నిబంధనల్ని ఫ్రీడ్ (Sam Bankman-Fried) ఉల్లంఘించినట్లు పేర్కొంది.
ఎఫ్టీఎక్స్ (FTX) బహమాస్ కేంద్రంగా పనిచేస్తోంది. సంస్థ పతనం తర్వాత ఫ్రీడ్ (Sam Bankman-Fried) ఆ దేశ రాజధాని నాసావూలోని తన విలాసవంతమైన భవంతిలోనే నివసిస్తున్నారు. ఎఫ్టీఎక్స్ నవంబరు 11న దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకుంది. అప్పటి వరకు ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టో (cryptocurrency) ఎక్స్ఛేంజీ. కస్టమర్ల డిపాజిట్లను ఈ సంస్థ తమ పెట్టుబడి కంపెనీ అలమెడా రీసెర్చ్తో కలపడంతో వివాదం మొదలైంది.
బ్యాంక్మన్ ఫ్రీడ్ (Sam Bankman-Fried)ను ఓ దశలో ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా అభివర్ణించారు. ఎఫ్టీఎక్స్ (FTX) పతనానికి ముందు వాషింగ్టన్లోని ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా పేరుగాంచారు. వామపక్ష, ప్రజాస్వామ్య భావజాలం ఉన్న రాజకీయపరమైన కార్యక్రమాలకు ఆయన మిలియన్ల డాలర్లు విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఒక్క నెల వ్యవధిలోనే కథ పూర్తిగా అడ్డం తిరిగింది. సరికొత్త డిజిటల్ ఫైనాన్స్ యుగ వైతాళికుడిగా పేరుగాంచిన ఫ్రీడ్ (Sam Bankman-Fried) ఇప్పుడు ఊచలు లెక్కెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఎఫ్టీఎక్స్ దివాలా వల్ల ప్రపంచమంతటా 10 లక్షల మందికి పైగా క్రిప్టో (cryptocurrency) మదుపరులు తీవ్రంగా నష్టపోయారు. దివాలా తీయకుండా ఆపడానికి కావాల్సిన 800 కోట్ల డాలర్లను బ్యాంక్మన్ ఫ్రీడ్ (Sam Bankman-Fried) సేకరించలేకపోయారు. ఈ ఏడాది జనవరిలో ఎఫ్టీఎక్స్ మార్కెట్ విలువను 3,200 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు. నేడు ప్రపంచమంతటా విస్తరించిన 134 ఎఫ్టీఎక్స్ అనుబంధ సంస్థల నెత్తిపై 5,000 కోట్ల డాలర్ల అప్పులు ఉన్నాయి. 2019లో స్థాపితమైన ఎఫ్టీఎక్స్లో వెంచర్ పెట్టుబడిదారులు, పింఛన్ నిధులు, కంపెనీలు, ఇతర భారీ మదుపరులు వందల కోట్ల డాలర్లు గుమ్మరించారు. చివరకు ఎఫ్టీఎక్స్ ఉద్యోగులు సైతం మదుపు చేశారు. నిరుడు చేతిలో డబ్బు తిరగక ఇబ్బంది పడుతున్న ఇతర క్రిప్టో (cryptocurrency) ఎక్స్ఛేంజీలకు ఎఫ్టీఎక్స్ 740 కోట్ల డాలర్లను రుణంగా ఇచ్చింది. ఇప్పుడు తానే బోల్తా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం