Sam Bankman Fried: ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’ బ్యాంక్మన్ ఫ్రీడ్ అరెస్ట్
ప్రముఖ క్రిప్టో సంస్థ ఎఫ్టీఎక్స్ దివాలాతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నష్టపోయారు.
న్యూయార్క్: దివాలా తీసిన క్రిప్టో (cryptocurrency) సంస్థ ఎఫ్టీఎక్స్ (FTX) మాజీ సీఈఓ శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ (Sam Bankman-Fried)ను సోమవారం బహమాస్లో పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా ప్రభుత్వం, బహమాస్ దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. ఎఫ్టీఎక్స్ (FTX) పతనం తర్వాత ఆయనపై ఇరు దేశాల్లో పలు ఆర్థిక నేరాల కింద అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే.
‘హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ’ ముందు హాజరుకావాల్సిన ఒకరోజు ముందే ఫ్రీడ్ (Sam Bankman-Fried)ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఆయన్ని వెంటనే అమెరికాకు అప్పగిస్తామని బహమాస్ అటార్నీ జనరల్ ర్యాన్ పిండర్ తెలిపారు. అలాగే తాము కూడా ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘించి, ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ ఎఫ్టీఎక్స్ (FTX) పతనానికి కారణమైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టడానికి యూఎస్తో కలిసి పనిచేస్తామని బహమాస్ ప్రధాని ఫిలిప్ డేవిస్ తెలిపారు. మరోవైపు అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సైతం ఆయనపై కేసు నమోదు చేస్తామని తెలిపింది. అమెరికా సెక్యూరిటీ నిబంధనల్ని ఫ్రీడ్ (Sam Bankman-Fried) ఉల్లంఘించినట్లు పేర్కొంది.
ఎఫ్టీఎక్స్ (FTX) బహమాస్ కేంద్రంగా పనిచేస్తోంది. సంస్థ పతనం తర్వాత ఫ్రీడ్ (Sam Bankman-Fried) ఆ దేశ రాజధాని నాసావూలోని తన విలాసవంతమైన భవంతిలోనే నివసిస్తున్నారు. ఎఫ్టీఎక్స్ నవంబరు 11న దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకుంది. అప్పటి వరకు ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టో (cryptocurrency) ఎక్స్ఛేంజీ. కస్టమర్ల డిపాజిట్లను ఈ సంస్థ తమ పెట్టుబడి కంపెనీ అలమెడా రీసెర్చ్తో కలపడంతో వివాదం మొదలైంది.
బ్యాంక్మన్ ఫ్రీడ్ (Sam Bankman-Fried)ను ఓ దశలో ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా అభివర్ణించారు. ఎఫ్టీఎక్స్ (FTX) పతనానికి ముందు వాషింగ్టన్లోని ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా పేరుగాంచారు. వామపక్ష, ప్రజాస్వామ్య భావజాలం ఉన్న రాజకీయపరమైన కార్యక్రమాలకు ఆయన మిలియన్ల డాలర్లు విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఒక్క నెల వ్యవధిలోనే కథ పూర్తిగా అడ్డం తిరిగింది. సరికొత్త డిజిటల్ ఫైనాన్స్ యుగ వైతాళికుడిగా పేరుగాంచిన ఫ్రీడ్ (Sam Bankman-Fried) ఇప్పుడు ఊచలు లెక్కెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఎఫ్టీఎక్స్ దివాలా వల్ల ప్రపంచమంతటా 10 లక్షల మందికి పైగా క్రిప్టో (cryptocurrency) మదుపరులు తీవ్రంగా నష్టపోయారు. దివాలా తీయకుండా ఆపడానికి కావాల్సిన 800 కోట్ల డాలర్లను బ్యాంక్మన్ ఫ్రీడ్ (Sam Bankman-Fried) సేకరించలేకపోయారు. ఈ ఏడాది జనవరిలో ఎఫ్టీఎక్స్ మార్కెట్ విలువను 3,200 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు. నేడు ప్రపంచమంతటా విస్తరించిన 134 ఎఫ్టీఎక్స్ అనుబంధ సంస్థల నెత్తిపై 5,000 కోట్ల డాలర్ల అప్పులు ఉన్నాయి. 2019లో స్థాపితమైన ఎఫ్టీఎక్స్లో వెంచర్ పెట్టుబడిదారులు, పింఛన్ నిధులు, కంపెనీలు, ఇతర భారీ మదుపరులు వందల కోట్ల డాలర్లు గుమ్మరించారు. చివరకు ఎఫ్టీఎక్స్ ఉద్యోగులు సైతం మదుపు చేశారు. నిరుడు చేతిలో డబ్బు తిరగక ఇబ్బంది పడుతున్న ఇతర క్రిప్టో (cryptocurrency) ఎక్స్ఛేంజీలకు ఎఫ్టీఎక్స్ 740 కోట్ల డాలర్లను రుణంగా ఇచ్చింది. ఇప్పుడు తానే బోల్తా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. -
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
అంబానీ, అదానీ తొలిసారి చేతులు కలిపారు. ఓ పవర్ ప్రాజెక్ట్ విషయంలో వీరి మధ్య భాగస్వామ్యం కుదిరింది. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. సోషల్మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు