5జీ వచ్చేసింది హైదరాబాద్ సహా 8 నగరాల్లో
హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 5జీ సేవలు శనివారం నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. దీంతో దేశంలో ఈ సేవలను ప్రారంభించిన తొలి టెలికాం కంపెనీగా భారతీ ఎయిర్టెల్ నిలిచినట్లు సంస్థ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ తెలిపారు.
2024 మార్చికల్లా దేశవ్యాప్తంగా
ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్
హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 5జీ సేవలు శనివారం నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. దీంతో దేశంలో ఈ సేవలను ప్రారంభించిన తొలి టెలికాం కంపెనీగా భారతీ ఎయిర్టెల్ నిలిచినట్లు సంస్థ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ తెలిపారు.
* ప్రధాని దిల్లీలో ఎయిర్టెల్ 5జీ సేవలను ప్రారంభించిన వెంటనే హైదరాబాద్, దిల్లీ, ముంబయి, వారణాసి, చెన్నై, బెంగళూరు సహా 8 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు.
* వచ్చే మార్చి నాటికి దేశంలోని అనేక నగరాలు 5జీ పరిధిలోకి వస్తాయని, 2024 మార్చి నాటికి దేశమంతా విస్తరిస్తామని వెల్లడించారు. ‘టెక్నాలజీని దేశ ప్రగతికి అనుసంధానం చేయడంలో ప్రధాని మోదీకి ఎంతో అవగాహన ఉంది. సాంకేతికతను నిశితంగా అర్థం చేసుకునే నాయకుడు ఉన్నందుకు మేము గర్విస్తున్నాం’ అని పేర్కొన్నారు. దేశంలో 4జీ సాంకేతికత అభివృద్ధి-విస్తరణకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చేసిన కృషినీ సునీల్ మిత్తల్ అభినందించారు. ‘ముకేశ్ 4జీని తీసుకొచ్చినప్పుడు దాన్ని అందుకోవడానికి మేము పరుగులు పెట్టాల్సి వచ్చింది. 4జీ వల్లే కొవిడ్ సందర్భంలోనూ దేశం ఒక్క నిమిషం కూడా ఆగలేదు. నిరంతరాయంగా సేవలు కొనసాగాయి’ అని మిత్తల్ వెల్లడించారు. స్టార్టప్లు ప్రారంభించాలన్న ప్రధాని పిలుపు మేరకు అవతరించిన సంస్థల్లో, ప్రతి నెలా కొన్ని యూనికార్న్లుగా (రూ.8,000 కోట్ల విలువైన) మారుతున్నాయని గుర్తు చేశారు. 5జీ వల్ల వేల సంఖ్యలో కొత్త సంస్థలు, డజన్ల కొద్దీ కొత్త యూనికార్న్లూ వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
టారిఫ్లపై
కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సింగ్ సెఖోన్ మాట్లాడుతూ.. ఎయిర్టెల్ 5జీ సేవలు, ఇప్పటి 4జీ ధరలతో ప్రస్తుతం లభిస్తాయని, కొత్త టారిఫ్లను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ‘మొబైల్ టవర్లలో కొన్ని 5జీ పరికరాలను బిగించాల్సి ఉంది. ఈ పనిని క్రమంగా పూర్తి చేస్తున్నాం. ఈ పరికరాలున్న టవర్లకు దగ్గరగా ఉన్న 5జీ మొబైల్ ఫోన్ల వినియోగదారులు ఈ సేవలు వినియోగించుకోవచ్చు’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?