Infosys: ఇన్ఫీ లాభం 11 శాతం వృద్ధి.. భవిష్యత్‌ అంచనాల్లో కోత

Infosys Q1 Results: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల సంస్థ ఇన్ఫోసిస్‌ క్యూ1లో రూ.5,945 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

Published : 20 Jul 2023 17:23 IST

బెంగళూరు: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో (Q1 Results) 11 శాతం వృద్ధితో రూ.5,945 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,362 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇక కంపెనీ ఆదాయం శాతం రూ.34,470 కోట్ల నుంచి రూ.37,933 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాల్లో ఇన్ఫోసిస్‌ కోత పెట్టింది. 2023-24 సంవత్సరానికి గానూ ఆదాయ వృద్ధి 1 - 3.5 శాతంగా ఉండే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. అంతకుముందు కంపెనీ ఆదాయ అంచనాలను 4-7 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులే కారణమని పేర్కొంది. ఆపరేటింగ్‌ మార్జిన్లలో 20-22 శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది.

టాయిలెట్ కోసం వందేభారత్‌ ఎక్కి.. ₹6 వేలు నష్టపోయాడు

ఇక జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 2.3 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 2.1 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది అధికమని తెలిపింది. మార్చి త్రైమాసికంలో 20.9 శాతంగా ఉన్న వలసల రేటు 17.3 శాతానికి తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. గత త్రైమాసికంతో పోలిస్తే జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,940 తగ్గిందని, ప్రస్తుతం 3,36,294 మంది పనిచేస్తున్నారని ఇన్ఫీ పేర్కొంది. ఫలితాల వెల్లడి నేపథ్యంలో గురువారం ఇన్ఫోసిస్‌ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 1.7 శాతం నష్టంతో రూ.1,449.50 వద్ద ముగిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని