Stock Market Closing Bell: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల సోమవారం లాభాల్లో ముగిశాయి...
ముంబయి: ఉదయం స్వల్ప తడబాటుతో ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కాసేపటికే పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు ప్రారంభంలో మార్కెట్లను కొంత కలవరపెట్టాయి. కానీ, దేశీయంగా ఉన్న సానుకూలతలు సూచీలకు దన్నుగా నిలిచాయి. మరోవైపు అమెరికాలో ఉద్యోగాల కల్పన అంచనాలను మించడంతో అంతర్జాతీయంగా మార్కెట్ల సెంటిమెంటును పెంచింది. దీంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు చమురు ధరలు దిగిరావడం, ఎఫ్ఐఐల కొనుగోళ్లు ఊపందుకోవడం సూచీలకు కలిసొచ్చింది. బలమైన కార్పొరేట్ ఫలితాలు ర్యాలీకి దన్నుగా నిలిచాయి.
* నిఫ్టీ ఉదయం 17,401.50 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,548.80 వద్ద గరిష్ఠాన్ని, 17,359.75 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 122.75 పాయింట్ల లాభంతో 17,520.25 వద్ద స్థిరపడింది. 58,417.71 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 58,934.90 - 58,266.65 మధ్య కదిలింది. చివరకు 465.14 పాయింట్లు ఎగబాకి 58,853.07 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.63 వద్ద ట్రేడయ్యింది.
* సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, మారుతీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే ఇండియా, విప్రో, పవర్గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.
మార్కెట్లోని ఇతర విశేషాలు..
* జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఎస్బీఐ ఏకీకృత నికర లాభాలు ఏడు శాతం తగ్గడంతో కంపెనీ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 3 శాతానికి పైగా కుంగాయి. చివరకు 2.06 శాతం నష్టపోయి రూ.520.10 వద్ద స్థిరపడ్డాయి.
* ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ రుణాలను ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లు అధిక రిస్క్ రుణాలుగా గుర్తించాయి. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 3.84 శాతం మేర నష్టపోయి రూ.47.60 వద్ద ముగిశాయి.
* ఎంఎంవేవ్, ఎఫ్డబ్ల్యూఏ, సీపీఈ ఉత్పత్తుల కోసం హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్తో క్వాల్కామ్ టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకొంది. ఈ నేపథ్యంలో హెచ్ఎఫ్సీఎల్ షేర్లు ఈరోజు 5.95 శాతం లాభపడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్