Twitter Blue: ట్విటర్ యూటర్న్.. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ నిలిపివేత!
కొత్త యజమాని ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి ట్విటర్లో వస్తోన్న మార్పులు యూజర్లను గందరగోళంలో పడేస్తున్నాయి. మొన్నటిదాకా ‘బ్లూ టిక్’కు ఛార్జీలు కట్టాలని చెప్పిన మస్క్.. ఇప్పుడు ఆ ప్రీమియం ఫీచర్ను నిలిపివేశారు.
శాన్ఫ్రాన్సిస్కో: ట్విటర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్’ను ప్రీమియం సర్వీసుగా మార్చి తీసుకొచ్చారు కొత్త యజమాని ఎలాన్ మస్క్. ఈ బ్లూ టిక్కు నెలవారీ ఛార్జీలు ప్రకటించారు. అయితే దీనివల్ల నకిలీ ఖాతాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో ఈ సర్వీసును నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కన్పించట్లేదని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ట్విటర్ను మస్క్ కొనుగోలు చేయకముందు.. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్ సంస్థలు, ప్రముఖులు, జర్నలిస్టులు.. ఇలా ప్రముఖుల ఖాతాలను వెరిఫై చేసి ఈ ‘బ్లూ టిక్’ కేటాయించేవారు. దీంతో ఆయా ఖాతాలు వారివే అనేందుకు కచ్చితమైన ఆధారం ఉండేది. రెండు వారాల క్రితం ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత.. ఈ ‘బ్లూ టిక్’ సర్వీసులో మార్పులు చేశారు. నెలవారీ ఛార్జీలతో ప్రీమియం వెర్షన్ను తీసుకొచ్చారు. అంటే.. నెలకు 8 డాలర్లు చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ‘బ్లూ టిక్’ ఇచ్చారు.
నిన్నటి నుంచి భారత్లోనూ ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అయితే, దీని తర్వాత నకిలీ ఖాతాలు విపరీతంగా పెరిగాయి. ప్రముఖ బ్రాండ్లు, కంపెనీలు, వ్యక్తుల పేరుతో నకిలీ ఖాతాలను తెరిచి వాటికి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. వాటికి కూడా బ్లూ టిక్ ఉండటంతో.. ఆ సంస్థలు/వ్యక్తుల అసలైన ఖాతా ఏదనే గందరగోళం నెలకొంది. దీనిపై ఆందోనలు వ్యక్తమవడంతో ఈ సర్వీసును ట్విటర్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ యాప్లో బ్లూ సబ్స్క్రిప్షన్ ఫీచర్ కన్పించట్లేదని పలువురు యూజర్లు పేర్కొన్నారు. అంటే.. ఇక కొత్తగా ఎవరి ఖాతాలకు ‘బ్లూ టిక్’ ఇవ్వబోరన్నమాట.
మరోవైపు ఇదే సమయంలో ట్విటర్ కొత్తగా ‘అధికారిక’ అనే ట్యాగ్ తీసుకొచ్చింది. వెరిఫైడ్ ఖాతాల కింద ఊదా రంగులో ‘Official’ అనే ట్యాగ్ను జత చేసింది. నిజానికి ఈ ట్యాగ్ను ఈ వారం మొదట్లోనే తీసుకురాగా.. ఆ తర్వాత దీనిపై కూడా ఆందోళనలు వ్యక్తమవడంతో కొద్ది గంటల్లోనే వెనక్కి తీసుకుంది. మళ్లీ శుక్రవారం నుంచి ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే అది కూడా పూర్తి స్థాయిలో కాదు. అమెజాన్, నైక్, కోకా-కోలా, గూగుల్ వంటి కొన్ని దిగ్గజ సంస్థల ఖాతాలకు మాత్రమే ఈ ట్యాగ్ కన్పిస్తోంది. సెలెబ్రిటీలు, ప్రభుత్వ ఖాతాలకు ఇంకా దీన్ని జత చేయలేదు. రానున్న రోజుల్లో జత చేస్తారా? లేదా? అన్నదానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ.. అధికారిక ట్యాగ్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే.. ఇక ట్విటర్లో ‘బ్లూ టిక్’ అనేది కన్పించకపోవచ్చేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి ట్విటర్.. యూజర్లకు గందరగోళం సృష్టిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
పదమూడు దేశాల్లో ‘నోటా’..!
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం