Used phones: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్లను పెరిగిన గిరాకీ: రీసెర్చ్ నివేదిక
Used phones: 5జీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది కొత్త ఫోన్లకు అప్గ్రేడ్ అవుతున్నారు. దీంతో కనీసం మూడేళ్లు వినియోగించిన సెకండ్హ్యాండ్, రీఫర్బిష్డ్ 4జీ ఫోన్లకు మంచి గిరాకీ కనిపిస్తోందని రీసెర్చ్ నివేదిక పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో సెకండ్హ్యాండ్ ఫోన్ల (Used phones)కు ఈ ఏడాది గిరాకీ పుంజుకుందని ఓ ప్రముఖ నివేదిక తెలిపింది. అదే సమయంలో కొత్త స్మార్ట్ ఫోన్ల (smartphones) విక్రయాలు తగ్గినట్లు వెల్లడించింది. ‘కౌంటర్ పాయింట్ రీసెర్చ్’ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ ఏడాది సెకండ్ హ్యాండ్, రీఫర్బిష్డ్ ఫోన్లు (తిరిగి విక్రయానికి సిద్ధం చేసిన పాత ఫోన్లు) దాదాపు 3.5-4.5 కోట్లు అమ్ముడవుతాయని అంచనా. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం అధికం. అదే సమయంలో కొత్త స్మార్ట్ఫోన్ల (smartphones) విక్రయాలు ఐదు శాతం తగ్గుతాయి. గత ఏడాది 15.1 కోట్ల కొత్త ఫోన్లు అమ్ముడయ్యాయి.
మరోవైపు ఏప్రిల్-జూన్లో కొత్త స్మార్ట్ఫోన్ల (smartphones) ఎగుమతులు మూడు శాతం తగ్గాయి. అయితే, జనవరి-మార్చిలో నమోదైన 19 శాతం క్షీణతతో పోలిస్తే మాత్రం మెరుగుపడినట్లే లెక్క. మరోవైపు వినియోగ ఫోన్ల విక్రయాలకు గిరాకీ పుంజుకోవడానికి అవి అందుబాటులో ధరలో లభ్యమవుతుండడం కాదని కౌంటర్పాయింట్ రీసెర్చ్ సహ- వ్యవస్థాపకుడు నీల్ షా వెల్లడించారు. వినియోగదారుల కొనుగోళ్ల తీరులో మార్పు రావడమే అందుకు కారణమన్నారు. కొంత మంది ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్కు మారాలనుకోవడం, ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ (smartphones) వాడుతున్న వాళ్లు దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకోడం ఈ విక్రయాలకు దోహదం చేస్తున్నట్లు తెలిపారు.
5జీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది కొత్త ఫోన్లకు అప్గ్రేడ్ అవుతున్నారు. దీంతో కనీసం మూడేళ్లు వినియోగించిన సెకండ్హ్యాండ్, రీఫర్బిష్డ్ 4జీ ఫోన్లకు మంచి గిరాకీ కనిపిస్తోందని రీసెర్చ్ నివేదిక పేర్కొంది. తక్కువ ధరకు ప్రీమియం ఫీచర్లు వస్తుండడంతో ఎంట్రీ లెవెల్ ఫోన్లు వినియోగిస్తున్న వారంతా వాటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. భారత్లో దాదాపు 80 కోట్ల ఫోన్లు ఉన్నాయి. వీటిలో 20 కోట్లు ఫీచర్ ఫోన్లేనని నివేదిక వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
TVS iQube: టీవీఎస్ ఐక్యూబ్లో మరో రెండు కొత్త వేరియంట్లు వచ్చాయి. ఇప్పుడు బేస్ వేరియంట్ రూ.95 వేలకే లభించనుంది. -
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
GPT-4o: ఓపెన్ఏఐ కొత్త చాట్జీపీటీ వెర్షన్ను విడుదల చేసింది. దీంట్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ తమ జెమిని కొత్త వెర్షన్ను ప్రకటించనున్న తరుణంలో ఓపెన్ఏఐ దీన్ని తీసుకురావడం గమనార్హం. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,125
Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 72,836 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 21,125 దగ్గర కొనసాగుతోంది. -
జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్: అమిత్షా
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, మన స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయనేే అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. అందువల్ల అంతకంటే ముందుగానే, ఎంపిక చేసుకున్న షేర్లను కొని పెట్టుకోవాల్సిందిగా మదుపర్లకు సూచించారు. -
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు బయోమెట్రిక్ ధ్రువీకరణ
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియ అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
కాకినాడ నుంచి అంతర్జాతీయ విపణికి అమ్మోనియా!
నార్వేలోని ఓస్లో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యారా క్లీన్ అమ్మోనియా అనే సంస్థ, గ్రీన్కో గ్రూపునకు చెందిన కాకినాడ యూనిట్ నుంచి రెన్యూవబుల్ అమ్మోనియా కొనుగోలు చేయనుంది. -
2030 కల్లా 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్
దేశంలోని 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలంటే, భారత్కు రూ.4.2 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భారీ నష్టాల నుంచి లాభాల్లోకి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆఖర్లో పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ 910 పాయింట్లు కోలుకుంది. -
‘ వార్షిక సమాచార నివేదిక’లో కొత్త వెసులుబాటు
వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం సరికొత్త వెసులుబాటును తీసుకొచ్చింది. ఇందులో సమాచార ధ్రువీకరణ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునే వీలు కల్పించినట్లు తెలిపింది. -
ఎఫ్టీఏ దేశాల నుంచి భారత్కు దిగుమతులు 38% పెరిగాయ్
మనదేశంతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఉన్న యూఏఈ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి భారత్కు దిగుమతులు 2018-19లో 136.20 బిలియన్ డాలర్లుగా ఉండేవి. -
ఎయిరిండియా, విస్తారా ఉద్యోగులకు జూన్ కల్లా ఫిట్మెంట్!
ఎయిరిండియా, విస్తారాకు చెందిన 7,000కు పైగా ఉద్యోగులకు జూన్లో ఫిట్మెంట్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన ఈ రెండు విమానయాన సంస్థల విలీన ప్రక్రియ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. -
బుల్లెెట్ ఈవీపై తొందర లేదు
బుల్లెట్ బ్రాండ్పై మోటార్సైకిళ్లను విక్రయిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ‘అద్భుత’ విద్యుత్ వాహనాన్ని (ఈవీ) తీసుకు రావాలని ఆశిస్తోంది. అందువల్ల ఈవీల్లోకి ప్రవేశించేందుకు తొందరపాటుతో వ్యవహరించడం లేదని చెబుతోంది. -
జొమాటో లాభం రూ.175 కోట్లు
ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే సంస్థ జొమాటో, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.188 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
రాజ్ వట్టికూటి సంస్థలో వాటా కోసం పోటీలో అంతర్జాతీయ పీఈ సంస్థలు
అమెరికన్-భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయిన రాజ్ వట్టికూటికి చెందిన ప్యూర్-ప్లే డిజిటల్ సేవల కంపెనీ అల్టిమెట్రిక్లో మెజారిటీ వాటా కోసం అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థలు పోటీలో ఉన్నాయి. -
భారత్లో మరిన్ని ఎస్యూవీ మోడళ్లు తీసుకొస్తాం: సుజుకీ
కార్ల విభాగంలో తాము కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు భారత్లో స్పోర్ట్ వినియోగ వాహన (ఎస్యూవీ) మోడళ్ల సంఖ్యను పెంచుకుంటామని జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
డ్రోన్ల తయారీ సంస్థ దక్ష అన్మ్యాన్డ్ సిస్టమ్స్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ తన వాటా పెంచుకుంది. ఈ సంస్థలో ఇప్పటికే రెండు దఫాలుగా కోరమాండల్ ఇంటర్నేషనల్ పెట్టుబడి పెట్టింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనం రాక ఆలస్యం కానుంది. అందుకు గల కారణాలను ఆ కంపెనీ ఎండీ వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
పాక్ ప్రభుత్వ కంపెనీలన్నీంటిని ప్రైవేటీకరిస్తాం: ప్రధాని షెహబాజ్
-
దిల్లీ vs లఖ్నవూ.. నేటి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్పై ప్రభావమెంత..?
-
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
-
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM