రెండు ·పడవలు మునిగి ఐదుగురి మృతి

రెండు పడవలు మునిగి ఐదుగురు మృతిచెందిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది...

Updated : 27 Oct 2020 14:51 IST

ముర్షీదాబాద్‌: రెండు పడవలు మునిగి ఐదుగురు మృతిచెందిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ముర్షీదాబాద్‌‌లోని డుమ్నీ చెరువులో సోమవారం సాయంత్రం దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 10 మంది ఉన్నారు. వీరంతా బెల్డంగా ప్రాంతానికి చెందినవారని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. విషయం తెలియగానే విపత్తు నిర్వహణ బృందం, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని