క్షణాల్లో లక్షలు లూఠీ!
ఉత్తర్ప్రదేశ్లోని రాంపుర్లో జరిగిన ఓ చోరీ ఉదంతమిది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటనలో లక్షల రూపాయల నగదును లూఠీ చేశారు దుండగులు. అది కూడా క్షణాల వ్యవధిలోనే. ఫ్లిప్కార్ట్కు చెందిన గిడ్డంగిలో.......
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్లోని రాంపుర్లో జరిగిన ఓ చోరీ ఉదంతమిది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటనలో లక్షల రూపాయల నగదును లూఠీ చేశారు దుండగులు. అది కూడా క్షణాల వ్యవధిలోనే. ఫ్లిప్కార్ట్కు చెందిన గిడ్డంగిలో ఈ దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి పదిగంటలకు గిడ్డంగిలోని ఉద్యోగులు నగదు లెక్కిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి అయిదుగురు దుండగులు తుపాకులు పట్టుకొచ్చారు. ఉద్యోగులను బెదిరించి రూ.లక్షల్లో నగదు ఉన్న డబ్బాను అమాంతం ఎత్తుకెళ్లారు. ఇదంతా కేవలం 18 సెకన్లలో జరిగింది. చోరీ జరిగిన తీరు మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు గిడ్డంగి ఇంఛార్జి అనుమూల్ కశ్యప్ తెలిపారు. అయితే దుండగులు దోచుకెళ్లిన నగదు ఎంతన్నది ఇంకా తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
సైబర్ నేరగాళ్ల చేతికి ‘మ్యూల్ ఖాతాలు’
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న పెద్ద ముఠాలో కీలక సభ్యుడైన ఓ యువకుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. -
రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయి స్వాధీనం
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన నిందితుడు కస్టడీలో ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకరు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. -
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడి మృతి
ఐస్గా భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు
తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్గఢ్లో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. -
ఫోన్ లాక్కొన్నారు.. అడ్డగిస్తే కత్తులతో పొడిచారు
చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని పోతున్న వారిని పట్టుకోబోయిన యువకుడిని నిందితులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన విషాదకర ఘటన హైదరాబాద్ గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!