అమీర్పేటలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య
హైదరాబాద్ అమీర్పేటలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణహత్యకు గురయ్యారు. ధరంకరం రోడ్డులో మేనమామ ఇంట్లో ఉంటున్న కేశన చంద్రశేఖర్రాజు (25)ను
అమీర్పేట: హైదరాబాద్ అమీర్పేటలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణహత్యకు గురయ్యారు. ధరంకరం రోడ్డులో మేనమామ ఇంట్లో ఉంటున్న కేశన చంద్రశేఖర్రాజు (25)ను అపార్ట్మెంట్ సెల్లార్లో కత్తులతో పొడిచి చంపారు. భార్య తరఫు బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు లభ్యమైన సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ధరంకరం రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్మెంట్ వద్ద ఈరోజు ఉదయం జరిగిన హత్య కేసు వివరాలను ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు మీడియాకు తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేఖర్రాజుతో మచిలీపట్నానికి చెందిన లక్ష్మీగౌరి(22)కి 2019 ఫిబ్రవరి 23న వివాహం జరిగింది. నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న చంద్రశేఖర్రాజు భార్యతో కలిసి ఆల్విన్కాలనీలో కాపురం పెట్టాడు. ఈ క్రమంలో భార్య ఈ ఏడాది జూన్ 1న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అతడి తల్లిదండ్రులు వరకట్నం కోసం వేధించడం వల్లే లక్ష్మీగౌరి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రశేఖర్రాజుతో పాటు అతడి తల్లిదండ్రులు వెంకట కృష్ణారావు, ఝాన్సీలక్ష్మిపై 304-బి కింద జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన చంద్రశేఖర్రాజు ఇటీవల బెయిలుపై విడుదలయ్యాడు.
మాటువేసి..
ప్రతి వారం బాలానగర్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి హాజరు వేయాల్సి ఉండటంతో తల్లి, సోదరుడితో కలిసి చంద్రశేఖర్రాజు ధరంకరం రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్మెంట్లో మేనమామ ఇంట్లో 40 రోజులుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం చికెన్ తీసుకొచ్చేందుకు కిందికి వచ్చిన చంద్రశేఖర్రాజుపై అప్పటికే మాటువేసిన నలుగురు వ్యక్తులు అపార్ట్మెంట్ సెల్లార్లోనే కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో రక్తం అధికంగా పోవడంతో చంద్రశేఖర్రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్యను ప్రత్యక్షంగా చూసిన వారు ఎస్సార్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని బంజారాహిల్స్ ఏసీపీ కె.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ సైదులు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అజయ్కుమార్, ఎస్సై భాస్కర్రావు ఇతర సిబ్బంది పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది.
భార్య తరఫు బంధువులపైనే అనుమానం
హత్య జరిగిన పద్మశ్రీ అపార్ట్మెంట్తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. హత్యలో చంద్రశేఖర్రాజు భార్య లక్ష్మీగౌరి దగ్గరి బంధువుల ప్రమేయంపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని పంపారు. హత్యకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?