Andhra News: చెంప పగలగొట్టి.. కాలితో తన్ని..!
తన ద్విచక్ర వాహనంపైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చిందన్న ఆగ్రహంతో విజయవాడ నగరం గవర్నర్పేట ప్రకాశం రోడ్డులో బుధవారం ఓ మహిళ వీరంగం సృష్టించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం... విజయవాడ వాంబే కాలనీకి చెందిన ముసలయ్య ఆర్టీసీ డ్రైవరు. విద్యాధరపురం డిపోలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం బస్సు తీసుకొని ప్రకాశంరోడ్డులో వెళుతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆంధ్రా ఆసుపత్రి ఎదురుగా నందిని అనే మహిళ...
ఆర్టీసీ డ్రైవర్పై మహిళ దాడి
సూర్యారావుపేట, న్యూస్టుడే: తన ద్విచక్ర వాహనంపైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చిందన్న ఆగ్రహంతో విజయవాడ నగరం గవర్నర్పేట ప్రకాశం రోడ్డులో బుధవారం ఓ మహిళ వీరంగం సృష్టించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం... విజయవాడ వాంబే కాలనీకి చెందిన ముసలయ్య ఆర్టీసీ డ్రైవరు. విద్యాధరపురం డిపోలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం బస్సు తీసుకొని ప్రకాశంరోడ్డులో వెళుతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆంధ్రా ఆసుపత్రి ఎదురుగా నందిని అనే మహిళ ద్విచక్రవాహనంపై వెళుతూ బస్సుకు అడ్డొచ్చింది. ముసలయ్య బ్రేకు వేయగా బస్సు మహిళ సమీపంలోకి వెళ్లి ఆగింది. ఈ ఆకస్మిక పరిణామంతో సదరు మహిళ ఆగ్రహంతో తిట్టుకుంటూ బస్సులోకి ప్రవేశించి డ్రైవర్పై దాడి చేసింది. డ్రైవర్ను కొట్టి, చొక్కా చింపి, కాలితో తన్నింది. విషయం తెలుసుకుని పోలీసులు వచ్చి ఇద్దరినీ పోలీసు స్టేషన్కు తరలించారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసులు మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన మహిళ కృష్ణలంక తారకరామానగర్కు చెందిన కుంభా నందినిగా గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా