Flight ticket prices: డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
దిల్లీ: విమాన టికెట్ కొనుగోలు చేసేటప్పుడు పలు రకాల సర్వీసులను ఆ ధరలోనే కలిపేస్తారు. దీనివల్ల అవసరం లేని సేవలకు సైతం ప్రయాణికులు చెల్లించక తప్పని పరిస్థితి. ఇది అనవసర భారమనే చెప్పాలి. దీనికి పరిష్కారంగా ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)’ ఇటీవల ఓ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.
‘‘విమానయాన సంస్థలు ప్రయాణ ఛార్జీల్లో వారు అందించే కొన్ని సేవలను కూడా కలిపేస్తాయి. వివిధ వర్గాల నుంచి అందిన ఫీడ్బ్యాక్ ప్రకారం.. చాలా సందర్భాల్లో ఆయా సేవలు ప్రయాణికులకు అవసరమై ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో వాటికి విడిగా రుసుము వసూలుచేసే విధానాన్ని తీసుకొస్తే మొత్తంగా టికెట్ ధర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఈనేపథ్యంలోనే ఆయా సేవలను టికెట్ ప్రాథమిక ధర నుంచి వేరు చేయాలి. వాటిని ‘ఆప్ట్-ఇన్’ పద్ధతిన ఎంచుకునే అవకాశం ప్రయాణికులకు కల్పించాలి’’ అని డీజీసీఏ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆప్ట్-ఇన్ పద్ధతిలో టికెట్ ప్రామాణిక ధరతో పాటు ఎంచుకున్న సేవలకు మాత్రమే ఛార్జీలు వేస్తారు. అంటే అవసరమైన సేవలను ప్రయాణికులు విధిగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అదే ‘ఆప్ట్-ఔట్’ విధానంలో అన్ని సేవల ఛార్జీలు టికెట్ ధరలో ముందే కలిపేస్తారు. వద్దనుకున్న వాటిని విధిగా తొలగించుకోవాల్సి ఉంటుంది. డీజీసీఏ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం కింద పేర్కొన్న సేవలను టికెట్ బేస్ ధర నుంచి వేరు చేయాల్సి ఉంటుంది.
- ప్రాధాన్య సీటు కేటాయింపు
- భోజనం/స్నాక్/డ్రింక్ (తాగునీరు మినహాయించి)
- ఎయిర్లైన్ లాంజ్ల వినియోగం
- చెక్-ఇన్ బ్యాగేజ్
- ఆట వస్తువులపై రుసుము
- సంగీత వాద్యాలపై ఛార్జీ
- విలువైన బ్యాగేజ్గా ప్రత్యేక ధ్రువీకరణ ఛార్జీ
మరోవైపు ఎయిర్లైన్ బ్యాగేజ్ పాలసీలో భాగంగా.. సంస్థలు ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్తో పాటు జీరో బ్యాగేజ్/నో-చెకిన్ బ్యాగేజ్ను కస్టమర్లకు అందించొచ్చు. అయితే, టికెట్ కొనుగోలు చేసేటప్పుడు వీటిని ఎంచుకొని.. తీరా ప్రయాణ సమయంలో కౌంటర్ దగ్గరకు బ్యాగేజ్తో వస్తే మాత్రం అప్పుడు ఛార్జీలు విధించుకునేందుకు అనుమతించింది. ఈ నియమాన్ని ప్రయాణికులకు కొనుగోలు సమయంలోనే విధిగా తెలియజేయాలి. టికెట్ ప్రింటవుట్పైనా ముద్రించాలి.
డీజీసీఏ తాజా మార్గదర్శకాల నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ టికెట్ల ధరల మదింపు విధానాన్ని స్వల్పంగా మార్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ప్రయాణికులు తమ బడ్జెట్కు అనుగుణంగా కావాల్సిన సేవలను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల భారీగా కాకపోయినా.. కొంతవరకు విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గొచ్చని వివరించారు.
మరోవైపు 12 ఏళ్ల చిన్నారులకు అదే పీఎన్ఆర్ నంబర్పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని డీజీసీఏ సూచించిన విషయం తెలిసిందే. విమానాల్లో కొన్నిసార్లు చిన్నారులకు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా సీటు కేటాయిస్తున్న ఉదంతాల నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన రికార్డులను నిర్వహించాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు