Dokka Manikya Vara Prasad: వైకాపాకు మరో షాక్‌.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా

ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్‌ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

Published : 26 Apr 2024 13:59 IST

అమరావతి: ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్‌ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైకాపా క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను సీఎం జగన్‌కు పంపారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తాడికొండ టికెట్‌ను ఆశించారు. అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైకాపా అవకాశం కల్పించింది. దీంతో గతకొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డొక్కా.. నేడు రాజీనామా చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని