Fraud alert!: అయోధ్య దర్శనం పేరిట ఫేక్ మెసేజ్లు.. పోలీసుల అలర్ట్!
Cyber Fraud alert: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు. నకిలీ సందేశాలతో సొమ్ములు దోచుకునేందుకు యత్నిస్తున్నారు.
Fraud alert | ఇంటర్నెట్ డెస్క్: రీఛార్జులు, కంపెనీ స్పెషల్ ఆఫర్లు అంటూ అమాయక ప్రజలకు వల వేసే సైబర్ నేరగాళ్లు (Cyber criminals).. ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారు. అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ (Ram temple event) కార్యక్రమం వేళ కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. అయోధ్య దర్శనం, ప్రసాదం, ఫొటోలు అంటూ నకిలీ మెసేజులు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తుల నమ్మకాలు, విశ్వాసాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రామ మందిరానికి డొనేషన్ల పేరిట క్యూఆర్ కోడ్లు పంపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను పట్టించుకోవద్దని, ధ్రువీకరించుకోకుండా ఎవరికీ సొమ్ములు పంపొద్దని సూచిస్తున్నారు.
రూ. 98 లక్షలు కొల్లగొట్టారు.. క్షణాల్లో 11 ఖాతాలకు మళ్లించారు
సైబర్ నేరగాళ్లు ‘అయోధ్య ప్రసాదం’ అంటూ మరోతరహా మోసాలకూ పాల్పడుతున్నారు. అయోధ్య ప్రసాదం డెలివరీ పేరిట తమకు తోచిన నంబర్లకు సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపుతున్నారు. చిరునామా వివరాల పేరిట మోసపూరిత లింకులు క్లిక్ చేయించి ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఫోన్ ఒకసారి వారి చేతిలోకి వెళితే కొన్ని క్షణాల్లోనే నగదు మాయం చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ రీఛార్జి పేరిట ఇదే తరహా మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అయోధ్య కార్యక్రమం నేపథ్యంలో రాములోరి చిత్రాలు చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో ఇంకొన్ని సైబర్ గ్యాంగులు శ్రీరాముడి లైఫ్ ఫొటోస్, అయోధ్య లైవ్ ఫొటోస్, అయోధ్య దర్శనం అంటూ సందేశాలు పంపిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ ఇలానే వ్యాక్సిన్ డోసులు, పీఎం కేర్స్కు విరాళాల పేరిట సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఇప్పుడు అయోధ్య సందర్భాన్నీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్మీడియా, వాట్సాప్లలో వచ్చే సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్