పెళ్లి మండపానికి వస్తున్న వరుడి కాల్చివేత
మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుందనగా వరుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.
అజాంగఢ్ (ఉత్తర్ ప్రదేశ్): మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుందనగా వరుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ దుర్ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని దేవ్గావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మసీర్పూర్ బజార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...
పెళ్లి ఊరేగింపు సింగ్పూర్ ప్రాంతం నుంచి బయలుదేరి వివాహ ప్రదేశానికి వచ్చింది. పెళ్లికుమారుడు మండపానికి వస్తుండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. వరుడిని వెంటనే బంధువులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
వరుడి మృతితో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించి వరుడు, వధువు కుటుంబసభ్యులను పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హంతకులు వరుడి ఊరేగింపును కొద్ది దూరం నుంచి వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ప్రదేశంలో సీసీ టీవీ కెమెరాలు లేవని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్