Suicide: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పాండురంగాపురం

Updated : 05 Apr 2022 07:16 IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పాండురంగాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, శివరాణి దంపతుల కుమారుడు అజయ్‌(25) బీటెక్‌ పూర్తి చేశాడు. తొలుత ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేసి కొన్ని నెలలుగా ఇంటివద్దే ఉంటున్నాడు. పలు ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పటికీ రాలేదు. మనస్తాపం చెందిన అజయ్‌ గత నెల 20న పంటచేనుకు వెళ్లి పురుగుమందు తాగాడు. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు పాల్వంచ గ్రామీణ ఎస్సై సుమన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని