Aditi Rao: సిద్ధార్థ్‌ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్‌

సిద్ధార్థ్‌తో తన రిలేషన్‌ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్‌ అయ్యారు. 

Published : 07 May 2024 12:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిద్ధార్థ్‌ వల్లే తనకు ప్రేమపై నమ్మకం పెరిగిందని నటి అదితిరావ్‌ (Aditi Rao Hydari) అన్నారు. గత నెలలో సిద్ధార్థ్‌- అదితిల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అనుబంధంపై ఓపెన్‌ అయ్యారు.

‘సిద్ధార్థ్‌ (Siddharth) నన్నెంతో మార్చాడు. అతడు పరిచయమయ్యాకే ప్రేమపై నమ్మకం మరింత పెరిగింది. ఎన్నో విషయాల్లో నా నమ్మకం నిజమైంది. మా ఇద్దరిది చిన్నపిల్లల స్వభావం. ప్రేమ ఉన్న చోట గౌరవం తప్పనిసరిగా ఉంటుంది. మేమిద్దరం ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటాం. నేను ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటాను. నటీనటులపై రూమర్స్‌ రావడం సహజమే. మా ఇద్దరుపై గాసిప్స్‌ వచ్చాయి. వాటికి చెక్‌ పెట్టేందుకే నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించాం. విషయాన్ని తెలుసుకున్న వారు సంతోషించి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్లందరికీ ధన్యవాదాలు. వాళ్ల అభిమానం ఎంతో విలువైనది’ అని చెప్పారు. సోషల్‌ మీడియా గురించి మాట్లాడుతూ..‘సెలబ్రిటీలు కూడా మనుషులే అని ప్రజలు గ్రహించాలి. వాళ్ల చుట్టూ తిరిగి వాళ్ల వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోవాలి. వారి గోప్యతకు భంగం కలిగించకూడదని నెటిజన్లు భావించాలి. అందరికీ చెప్పే విషయమైతే నటీనటులు స్వయంగా వెల్లడిస్తారు’ అని చెప్పారు.

ఇక అదితి రావ్‌ తాజాగా  ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించారు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారమవుతోంది. ఇందులో అదితి బిబ్బోజాన్‌ పాత్రలో మెప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని