Arya: ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం..
2004 మే 7.. ఇప్పటిలానే అప్పుడూ ఎండలు మండిపోతున్నాయి. స్కూళ్లూ కాలేజీలకు సెలవులిచ్చేశారు. ఓటీటీలు లేవు కాబట్టి ఇక వినోదమంటే థియేటర్లే. అలా ఆ రోజు విడుదలైన సినిమాల్లో ‘ఆర్య’ (Arya) ఒకటి. మార్నింగ్ షో డివైడ్ టాక్. ‘వన్సైడ్ లవ్’ కాన్సెప్ట్ కావడంతో ప్రేక్షకులూ వన్సైడ్ రిజల్ట్ ఇవ్వలేకపోయారు. కట్చేస్తే 125 రోజులు ప్రదర్శితమై, టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసింది. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. అసలు ఈ కథ దర్శకుడు సుకుమార్ ఎవరి కోసం రాశారు? ముందుగా అనుకున్న టైటిలేంటి? చూద్దాం (#20 Years of Arya)..
‘దిల్’ సక్సెస్ సుకుమార్కు ప్లస్
కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేసే సుకుమార్కి (Sukumar) సినిమాలపై ఎంతో ఆసక్తి. ఆ ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి వెళ్లి, అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం అందుకున్నారు. ఆ పని చేస్తూనే తనో కథ రాసుకున్నారు. అదే సమయంలో రాజు నిర్మాతగా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దిల్’కీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. ‘దిల్ సక్సెస్ అయితే నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా. కథ సిద్ధం చేసుకో’ అని రాజు మాటిచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రాజుని ‘దిల్ రాజు’ (Dil Raju)గా మార్చేసింది. ఆ విజయోత్సాహంలో ఉన్న ఆయన సుకుమార్ చెప్పిన కథ విన్నారు. ‘బాగుంది గానీ కమర్షియల్గా హిట్ కాదేమో’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు చర్చల అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
‘నచికేత’ అనుకున్నారు..
‘దిల్’ స్పెషల్ షోకి అల్లు అర్జున్ (Allu Arjun) కూడా వెళ్లారు. అతని చలాకీతనం, హాస్య చతురత చూసిన సుకుమార్ ‘నా హీరోలాంటి క్యారెక్టరే ఇతనిది’ అని అనుకున్నారు. మనసులో మాట దిల్ రాజుకి చెబితే ఆయన వెంటనే వెళ్లి అర్జున్తో మాట్లాడారు. ‘గంగోత్రి’ తర్వాత ఎన్నో కథలు విని విసిగిపోయిన ఆయన.. వీళ్లు చెప్పేదీ రొటీన్ స్టోరీనే అనుకుని వద్దన్నారు. ఎట్టకేలకు విన్నాక అదుర్స్ అన్నారు. అల్లు అరవింద్, చిరంజీవి సైతం ప్రాజెక్టుకు ఎస్ చెప్పారు. ఈ ట్రెండీ లవ్స్టోరీకి ‘నచికేత’ అని టైటిల్ పెట్టాలనుకున్నా చివరకు ‘ఆర్య’ని ఫిక్స్ చేశారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేయడమే కాదు.. ఓ సీన్లోనూ కనిపిస్తారు.
ఎక్కడా విన్నా అమలాపురం.. ఆహాపురమే!
2003 నవంబరు 19న సినిమా లాంఛనంగా ప్రారంభమైన ‘ఆర్య’ను 120 రోజుల్లో పూర్తి చేశారు. దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబో మొదలైందీ ఈ చిత్రంతోనే. ఇప్పటివరకూ వారి ఆల్బమ్స్ అన్నీ సూపర్ హిట్సే. ‘ఫీల్ మై లవ్’ అంటూ ప్రతి ప్రేమికుడు ఆ ప్రేమను ఫీలయ్యాడు.. ‘తకదిమితోం’ అంటూ చిందులు తొక్కాడు.. ‘అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం’ అంటూ అక్షరమాలకు కొత్త అర్థం చెప్పి, చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ ఆడించారు.. పాడించారు. ఈ మూవీని రూ.4 కోట్లతో నిర్మిస్తే, ఫుల్ రన్లో రూ.30 కోట్లు వసూలు చేసింది. మలయాళంలో డబ్ చేసి విడుదల చేస్తే.. రూ.35 లక్షల వరకూ వసూలు చేయడమే కాదు, అల్లు అర్జున్కు అక్కడ అభిమానగణమే ఏర్పడేలా చేసింది. ఉత్తమ దర్శకుడిగా తొలి చిత్రంతోనే సుకుమార్ ఫిల్మ్ఫేర్ అందుకున్నారు. ఇక ఉత్తమ స్క్రీన్ప్లే (సుకుమార్), స్పెషల్ జ్యూరీ (అల్లు అర్జున్), ఉత్తమ ఫైట్స్ (రామ్- లక్ష్మణ్), ఉత్తమ గాయకుడు (సాగర్) కేటగిరీల్లో నంది అవార్డులు లభించాయి. ‘ఆర్య’ తర్వాత అర్జున్- సుకుమార్- దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ‘ఆర్య 2’, ‘పుష్ప’ వచ్చాయి. ‘పుష్ప 2’ ఆగస్టు 15న విడుదల కానుంది.
అల్లరి నరేశ్ కోసం..
బాక్సాఫీస్ వద్ద ఇంత సక్సెస్ అయిన ఈ మూవీకి తొలుత అనుకున్న కథానాయకుడు ఎవరో తెలుసా? అల్లరి నరేశ్ (Allari Naresh). ఆయనను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ ఈ కథను రాసుకున్నారట. ఏమైందో ఏమోగానీ అది ఆయన వరకూ వెళ్లలేదు. ఓ ఇంటర్వ్యూలో నరేశ్ మాట్లాడుతూ.. ‘‘సుకుమార్ ‘100%లవ్’ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశారు. ‘‘అల్లరి’లోని మీ నటన నన్ను ఆకట్టుకుంది. ‘ఆర్య’ కథ మీ కోసం రాసుకున్నా’’ అని చెప్పారు. ఎవరికి రాసి పెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆర్యగా అల్లు అర్జున్ కంటే బాగా ఎవరూ చేయలేరు’’ అని ప్రశంసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండ చేయలేకపోయిన ఆ నాలుగు హిట్ మూవీలేంటో తెలుసా?
యువతలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన గతంలో కొన్ని సినిమాలను చేయలేకపోయారు. అవి బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటి? వాటి కథేంటి? -
ఆయన సలహాను పట్టించుకోని సావిత్రి
ప్రముఖ నటి సావిత్రి (Savitri) దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘చిన్నారి పాపలు’. దీనికి ఎలాగైనా ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుతో మాటలు రాయించాలని ఆవిడ ప్రయత్నించారు. -
అందుకే పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చేయలేనన్నారు.. కానీ!
పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంగతులు మీకోసం.. -
‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ
అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. ఆ నాటికి ప్రదర్శిస్తుండగా, భారీ గాలివాన వచ్చింది. -
Pushpa: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక హరీశ్ శంకర్
Pushpa 2: The Rule: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. -
శ్రీదేవికి రజనీ కంటే ఎక్కువ పారితోషికం
దివంగత తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్స్టార్ అని సంబోధిస్తుంటారు. -
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలై నేటికి 50 ఏళ్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలివీ.. -
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్బాబు, పూరి జగన్నాథ్ల కాంబినేషన్కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్కు రాలేదు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా