Andhra News: రైలు ఎక్కుతూ జారిపడిన తల్లీకుమార్తె
రైలు ఎక్కుతూ జారి పడిన ఘటనలో కుమార్తె మృతి చెందగా తల్లి చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఏలూరు రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది.
చికిత్స పొందుతూ కుమార్తె మృతి
ఏలూరు నేరవార్తలు, న్యూస్టుడే: రైలు ఎక్కుతూ జారి పడిన ఘటనలో కుమార్తె మృతి చెందగా తల్లి చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఏలూరు రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా వంగాయగూడేనికి చెందిన నువ్వుల లక్ష్మి, ఆమె కుమార్తె సాయిదుర్గ (25) సోమవారం విశాఖపట్నం వెళ్లేందుకు ఏలూరు రైల్వేస్టేషన్కు వచ్చారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీ ఎక్కేందుకు ప్రయత్నించారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందు కుమార్తె సాయిదుర్గ రైలు ఎక్కి, తల్లిని పైకి లాగుతుండగా అదుపు తప్పడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఆ సమయంలోనే రైలు కదలడంతో ఫ్లాట్ఫాంకు బోగీకి మధ్య ఇద్దరూ ఇరుక్కుపోయారు. వారిని రైలు కొంతదూరం లాక్కెళ్లింది. ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆర్పీఎఫ్ ఏఎస్సై రామారావు రైలు కిందకు వెళ్లి పైకి తీసుకొచ్చారు. తల్లీకుమార్తెను 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయిదుర్గ మృతి చెందారు. ఆమె బధిరురాలు కావడంతో వివాహం చేయకుండా తల్లిదండ్రులే పోషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్