ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు

ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర గురూజీ మంగళవారం కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణ హత్యకు గురయ్యారు. నగర శివార్లలోని ఉణకల్‌ హోటల్‌లో ఈ ఘాతుకం

Updated : 06 Jul 2022 06:49 IST

హుబ్బళ్లి, న్యూస్‌టుడే: ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర గురూజీ మంగళవారం కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణ హత్యకు గురయ్యారు. నగర శివార్లలోని ఉణకల్‌ హోటల్‌లో ఈ ఘాతుకం చోటుచేసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ లాభూరాం వెల్లడించారు. వాస్తు సూచనల కోసమంటూ వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఆయనను కత్తులతో విచ్చలవిడిగా పొడిచి పరారయ్యారు. ఆయన శరీరంపై 39 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుల ఆచూకీ కోసం... హోటల్‌ రిసెప్షన్‌లో అమర్చిన నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ హత్యకు కారణాలు తెలియరాలేదు. చంద్రశేఖర గురూజీకి సరళవాస్తు నిపుణుడిగా జాతీయ స్థాయిలో పేరుంది. అనేక టెలివిజన్‌ ఛానళ్లలో ఆయన వాస్తుకు సంబంధించిన సలహాలు, సూచనలిచ్చేవారు. 2వేలకుపైగా సెమినార్లలో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 16కు పైగా అవార్డులు లభించాయి. సివిల్‌ ఇంజినీరింగ్‌తో పాటు కాస్మిక్‌ ఆర్కిటెక్చర్‌లో చంద్రశేఖర గురూజీ డాక్టరేట్‌ పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని