మద్యంలో స్పిరిట్‌ కలిపి తాగి ఇద్దరి మృతి

తాగిన మైకంలో సర్జికల్‌ స్పిరిట్‌ను మద్యంలో కలిపి తాగిన ఇద్దరు మృతి చెందారు. విజయవాడ శివారు వాంబేకాలనీకి చెందిన పైడమ్మ(65) అదేకాలనీకే చెందిన సింగిడి కొండయ్య

Published : 06 Aug 2022 05:03 IST

విజయవాడ, న్యూస్‌టుడే: తాగిన మైకంలో సర్జికల్‌ స్పిరిట్‌ను మద్యంలో కలిపి తాగిన ఇద్దరు మృతి చెందారు. విజయవాడ శివారు వాంబేకాలనీకి చెందిన పైడమ్మ(65) అదేకాలనీకే చెందిన సింగిడి కొండయ్య (60)తో కలిసి ఎ బ్లాకులో నివాసం ఉంటోంది. వీరు కూరగాయలు అమ్ముతూ జీవించేవారు. గురువారం రాత్రి తాగిన మైకంలో.. మద్యంలో సర్జికల్‌ స్పిరిట్‌ను కలిపి తాగారు. స్పిరిట్‌ మోతాదు ఎక్కువ కావడంతో.. రక్తపు వాంతులు అయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో పైడమ్మ మనవరాలు వచ్చి చూడగా వారిద్దరూ నేలపై పడిపోయిఉండటం, ఇద్దరి శరీరాలపై, నేలపై రక్తపు మరకలు చూసి తన తల్లికి తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని