వృద్ధురాలిపై అత్యాచారం.. హత్య

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లలో ఓ వృద్ధురాలు అత్యాచారంతోపాటు హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. విప్పర్లకు చెందిన వృద్ధురాలు (65) తన ఇంటి ముందు

Published : 14 Aug 2022 05:21 IST

పోలీసుల అదుపులో యువకుడు

రొంపిచర్ల, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లలో ఓ వృద్ధురాలు అత్యాచారంతోపాటు హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. విప్పర్లకు చెందిన వృద్ధురాలు (65) తన ఇంటి ముందు రోజులాగా శుక్రవారం రాత్రి నిద్రకు ఉపక్రమించింది. శనివారం వేకువన ఎంతకూ లేవకపోవటంతో సమీప బంధువులు వెళ్లి చూడగా, అప్పటికే మృతి చెంది ఉంది. బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతురాలి శరీరంపై గాయాలతోపాటు దుస్తులు తొలగించి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చనే అనుమానంతో వారు డాగ్‌స్క్వాడ్‌ను తెప్పించారు. మృతదేహం వద్ద నుంచి సమీపంలోని ఓ ఇంటి వద్దకు డాగ్‌స్క్వాడ్‌లు వెళ్లాయి. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న పెరవలి మణికంఠ (27)ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. తాగిన మైకంలో అతడు అత్యాచారం చేయడంతోపాటు దాడిచేసి చంపినట్లు విచారణలో తెలిసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని