logo

చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్‌.. వైకాపాకు సీఎం రమేశ్‌ హెచ్చరిక

రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ వైకాపా నాయకులను హెచ్చరించారు.

Updated : 26 Apr 2024 07:45 IST

 

చోడవరం, న్యూస్‌టుడే: రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ వైకాపా నాయకులను హెచ్చరించారు. చోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు నామినేషన్‌ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో సీఎం రమేశ్‌ ప్రసంగించారు. అధికార మదం తలకెక్కిన జగన్‌తోపాటు ఆయన అనుయాయులు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ‘సజ్జల రామకృష్ణారెడ్డీ.. చిరంజీవిని విమర్శించే అర్హత నీకుందా. నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. అవాకులు, చవాకులు పేలితే మెగా ఫ్యామిలీ అభిమానులు రోడ్డు మీదకు ఈడ్చి కొడతార’న్నారు. బటన్‌ నొక్కానంటున్న సీఎం జగన్‌.. మే 13న ఓటర్లు నొక్కే బటన్‌తో ఇంటికి పోవడం ఖాయమన్నారు. 

ర్యాలీలో సీఎం రమేశ్‌, చోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి రాజులకు గజమాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని