రైలు ఆగిందని సెల్ఫోన్ చోరీకి యత్నం
రైలు ఆగడంతో కిటికీలోంచి సెల్ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించిన ఓ దొంగకు... ప్రయాణికులు మూడు చెరువుల నీళ్లు తాగించారు! బిహార్లోని భాగల్పుర్లో ఈ ఘటన చోటుచేసుకొంది.
ప్రయాణికులకు చిక్కడంతో ఐదు కిలోమీటర్లు వేలాడుతూ ప్రయాణం!
భాగల్పుర్ (బిహార్): రైలు ఆగడంతో కిటికీలోంచి సెల్ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించిన ఓ దొంగకు... ప్రయాణికులు మూడు చెరువుల నీళ్లు తాగించారు! బిహార్లోని భాగల్పుర్లో ఈ ఘటన చోటుచేసుకొంది. ఇక్కడి మమల్ఖా రైల్వేస్టేషన్లో బుధవారం ఓ రైలు నిలవగా... ఓ యువకుడు రైలు కిటికీలో చేయిపెట్టి, ప్రయాణికుడి చేతిలోని సెల్ఫోన్ను లాక్కున్నాడు. ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా... పక్కన తలుపు వద్ద ఉన్న కొందరు ప్రయాణికులు అతడి చేయిని పట్టుకున్నారు. ఇంతలోనే రైలు కదిలింది. దీంతో తనను విడిచిపెట్టాలని అతడు వేడుకున్నా, వారు వినలేదు. ఈ క్రమంలోనే రైలు 80-100 కిలోమీటర్ల వేగం అందుకుంది. కొద్దిసేపటి తర్వాత ప్రయాణికులు అతడిని బోగీలోకి ఈడ్చి కొట్టారు. ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కహల్గావ్ స్టేషన్లో ఆర్పీఎఫ్ జవాన్లకు నిందితుడిని అప్పగించినట్టు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారినా, అధికారులు ధ్రువీకరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!